NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్
    తదుపరి వార్తా కథనం
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్
    పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్

    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 17, 2025
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

    శనివారం ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉందని ధ్వజమెత్తారు.

    మానవాళికి ముప్పుగా మారిన దేశంగా పాకిస్తాన్‌ను పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికలపై ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించేందుకు 7 ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది.

    ఈ బృందాల్లో ఓవైసీ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందాలు వివిధ దేశాల్లో పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదం, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి అంశాలపై చర్చించనున్నాయి.

    పాక్ ఉగ్రవాదంపై ప్రపంచానికి తాను స్పష్టమైన సందేశం ఇవ్వబోతున్నానని ఓవైసీ తెలిపారు.

    పీటీఐతో మాట్లాడిన ఆయన, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకుల రక్తపాతం కొనసాగిస్తున్నారని అన్నారు.

    Details

    జియావుల్ హక్ కాలం నుంచే పాక్ ఉగ్ర ప్రణాళికలు

    భారతదేశమే ఈ ఉగ్రవాదానికి అతిపెద్ద బాధిత దేశమని, జియా ఉల్ హక్ కాలం నుంచే ప్రజల ఊచకోత జరుగుతోందని విమర్శించారు.

    భారతదేశంలోని 20 కోట్ల ముస్లిములను పరిగణనలోకి తీసుకోకుండా పాకిస్థాన్ తాము మాత్రమే నిజమైన ఇస్లామిక్ దేశమని భావించడాన్ని తప్పుపట్టారు.

    దేశాన్ని అస్థిరత వైపు నడిపించడం, మత విభేదాలను రెచ్చగొట్టడం, అభివృద్ధికి అడ్డుకాయడం పాక్ లక్ష్యమని ఓవైసీ ఆరోపించారు.

    1947లో స్వాతంత్ర్యం అనంతరం జమ్ముకశ్మీర్‌లోకి గిరిజన ఆక్రమణదారులను పంపినప్పుడు నుంచే పాక్ ఉగ్ర ప్రణాళిక ప్రారంభమైందని గుర్తుచేశారు.

    ఇది ఇప్పటికి కొనసాగుతోందని, భవిష్యత్తులోనూ ఆగబోదని వ్యాఖ్యానించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఇక సహించదని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అసదుద్దీన్ ఒవైసీ

    తాజా

    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు

    అసదుద్దీన్ ఒవైసీ

    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ నరేంద్ర మోదీ
    దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి దిల్లీ
    హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్/ఏఐఎంఐఎం/ఎంఐఎం
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025