NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / X Handle: భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రికి షాక్‌.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్‌' ఖాతా బ్లాక్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    X Handle: భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రికి షాక్‌.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్‌' ఖాతా బ్లాక్‌
    భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రికి షాక్‌.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్‌' ఖాతా బ్లాక్‌

    X Handle: భారత్‌లో పాక్‌ రక్షణ మంత్రికి షాక్‌.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్‌' ఖాతా బ్లాక్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 29, 2025
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ అసిఫ్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం ఆయన ఎక్స్‌ (మాజీ ట్విటర్) ఖాతాను బ్లాక్‌ చేసింది.

    ఇప్పటికే పాకిస్థాన్‌ ఆధారిత పలు యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించిన కేంద్రం, తాజాగా ఖవాజా ఖాతాపై వేటు వేసింది.

    ఆయన ఖాతాను ఓపెన్ చేయగానే 'చట్టపరమైన డిమాండ్‌కు స్పందనగా ఈ ఖాతా నిలిపివేశామని అనే సందేశం వినియోగదారులకు కనపడుతోంది.

    భారత్‌, పాకిస్థాన్‌ మధ్య వాస్తవాలు మరుగున పడేలా సమాచారం ప్రసారం చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది. పహల్గాం దాడి తర్వాత మళ్లీ పాక్‌ మంత్రిగా ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    Details

    బలగాలను అప్రమత్తం చేశాం

    అమెరికా, బ్రిటన్‌ తదితర పశ్చిమ దేశాల కోసమే మేము మూడు దశాబ్దాలుగా ఈ చెత్త పనుల్లో పాల్గొన్నాం. అది ఒక పొరబాటు. దాని వల్లే పాక్‌ ఇబ్బందులు పడుతోంది.

    సోవియట్ యుద్ధంలో పాల్గొనకుండా ఉండి ఉంటే, పాక్‌కు గొప్ప రికార్డ్ ఉండేదని వ్యాఖ్యానించారు. అయితే, లష్కరే తోయిబా ఇప్పుడు తమ దేశంలో లేదంటూ వివరణ ఇచ్చారు.

    ఇక సోమవారం ఓ వార్తాసంస్థతో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్ ప్రతీకార దాడి జరగొచ్చు అన్న నేపథ్యంలో తాము మా బలగాలను అప్రమత్తం చేశాం. కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.

    Details

    పాక్ ఆధారిత ఛానళ్లపై నిషేధం

    అయితే, ఏ దిశగా చర్యలు తీసుకున్నారన్న వివరాలు వెల్లడించలేదు. గత నెల 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ఘటన తర్వాత భారత్‌ పాక్‌పై కఠిన వైఖరి అవలంబించింది. పాక్‌ ఆధారిత ఛానళ్లపై నిషేధం, పాక్‌ జాతీయులను దేశం నుంచి పంపివేత వంటి చర్యలు తీసుకుంటోంది.

    తాజా చర్యగా పాక్‌ రక్షణమంత్రికి చెందిన ఎక్స్‌ ఖాతాను కూడా బ్లాక్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    T-72 tank: భారత్-రష్యా భారీ డీల్.. T-72 ట్యాంకుల అప్‌గ్రేడ్‌కు $248 మిలియన్ ఒప్పందం రష్యా
    USA: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి.. బాధ్యులపై చర్యల కోసం భారత్ డిమాండ్ అమెరికా
    US: బీచ్‌లో అదృశ్యమైన సుదీక్ష.. చివరిసారి చూసిన వ్యక్తిపై అనుమానాలు! అమెరికా
    Tariff Cuts: భారత్‌-అమెరికా వాణిజ్య వివాదం.. సుంకాల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన అమెరికా

    పాకిస్థాన్

    Pakistan: బలూచిస్థాన్‌లో మిలిటరీ కాన్వాయ్‌పై బాంబు దాడి.. ఐదుగురు సైనికులు మృతి ప్రపంచం
    Pakistan: పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ పై దాడి.. షాకింగ్ వీడియో విడుదల చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు  అంతర్జాతీయం
    Pakistan: బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు.. జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి అంతర్జాతీయం
    PCB: పీసీబీకి ఆర్థిక కష్టాలు.. ఛాంపియన్స్‌ ట్రోఫీతో కోలుకోలేని నష్టం ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025