NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వ ఎక్స్‌ ఖాతా భారత్‌లో నిలిపివేత 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వ ఎక్స్‌ ఖాతా భారత్‌లో నిలిపివేత 
    పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వ ఎక్స్‌ ఖాతా భారత్‌లో నిలిపివేత

    Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వ ఎక్స్‌ ఖాతా భారత్‌లో నిలిపివేత 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.

    ఈ దాడి నేపథ్యంలో న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కీలక దౌత్య చర్యలు తీసుకుంది.

    అందులో భాగంగానే తాజాగా మరో గంభీర పరిణామం చోటుచేసుకుంది.

    పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక 'ఎక్స్‌' ఖాతాను (Pakistan Government X Account) భారత్‌లో నిలిపివేశారు.

    ప్రస్తుత పరిణామాల దృష్ట్యా, ఈ ఖాతా వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని భావించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ, సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్‌'ను సంప్రదించి, భారత భూభాగంలో పాకిస్థాన్ ప్రభుత్వ ఖాతాను నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది.

    వివరాలు 

    పాకిస్థాన్‌కి గట్టి హెచ్చరిక జారీ

    ఈ విజ్ఞప్తిని అంగీకరించిన 'ఎక్స్‌' సంస్థ, ఆ ఖాతాను భారత్‌లో నిలిపివేసింది. దీంతో ఇకపై భారత యూజర్లు ఆ ఖాతాలో ఉన్న కంటెంట్‌ను చూడలేరు.

    ఈ క్రమంలో, పహల్గాం దాడికి స్పందనగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం భద్రతా వ్యవహారాలపై కేంద్ర క్యాబినెట్ కమిటీ (సీసీఎస్‌) అత్యవసరంగా సమావేశమైంది.

    ఈ సమావేశంలో పాకిస్థాన్‌కి గట్టి హెచ్చరిక జారీచేయాలని నిర్ణయించారు.

    ఆ దేశం తన భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించనివ్వకుండా చర్యలు తీసుకునే వరకూ, భారత్ కఠిన వైఖరి కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

    వివరాలు 

    వారం రోజుల్లోగా దేశాన్ని విడిచి పెట్టండి 

    ఈ నిర్ణయాల సందర్భంగా సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

    అంతేకాక, ఇరు దేశాల మధ్య ఉన్న అటారీ సరిహద్దు గేటును కూడా తాత్కాలికంగా మూసివేశారు.

    భారత్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులు ఇకపై అవాంఛిత వ్యక్తులుగా గుర్తించి, వారందరికీ వారం రోజుల్లోగా దేశాన్ని విడిచిపెట్టాలని స్పష్టం చేసింది కేంద్రం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎక్స్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఎక్స్

    జుకర్ బర్గ్ తో ఫైటింగ్ చేస్తానంటున్న ఎలాన్ మస్క్: కౌంటర్ వేసిన థ్రెడ్స్ అధినేత  ఎలాన్ మస్క్
    ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే?  ట్విట్టర్
    Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్‌కు గుడ్ బై చెప్పిన మస్క్ ఎలాన్ మస్క్
    ఎక్స్ లో కీలక మార్పు: ఇకపై రిప్లయ్ ఇచ్చే అవకాశమూ పోయినట్టే!  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025