NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Panchayat Parliament 2.0: లోక్‌సభలో నేడు పంచాయత్‌ సే పార్లమెంట్‌ 2.0 ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Panchayat Parliament 2.0: లోక్‌సభలో నేడు పంచాయత్‌ సే పార్లమెంట్‌ 2.0 ప్రారంభం
    లోక్‌సభలో నేడు పంచాయత్‌ సే పార్లమెంట్‌ 2.0 ప్రారంభం

    Panchayat Parliament 2.0: లోక్‌సభలో నేడు పంచాయత్‌ సే పార్లమెంట్‌ 2.0 ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 06, 2025
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంట్ సెషన్లు, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన 'పంచాయత్‌ సే పార్లమెంట్‌ 2.0' కార్యక్రమం ఇవాళ లోక్‌సభలో ప్రారంభం కానుంది.

    గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా, ఈ అవగాహన కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనున్నారు.

    ఈ కార్యక్రమంలో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన షెడ్యూల్డ్‌ తెగల 502 మంది మహిళా ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.

    ఇందులో మహిళా ప్రతినిధులు కొత్త పార్లమెంట్ భవనం, సంవిధాన్‌ సదన్, ప్రధాన మంత్రి సంగ్రహాలయం, రాష్ట్రపతి భవన్‌లను సందర్శిస్తారు.

    Details

    స్వాగత ఉపన్యాసం ఇవ్వనున్న ఉత్పల్ కుమార్ సింగ్

    షెడ్యూల్డ్ తెగల నుంచి ఎన్నికైన మహిళా ప్రతినిధులకు నాయకత్వ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, రాజ్యాంగ నిబంధనలు, పార్లమెంటరీ విధానాలు, పాలనపై అవగాహన పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం.

    ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణాభివృద్ధి, విద్య, ఇతర రంగాల్లో షెడ్యూల్డ్ తెగల మహిళా ప్రతినిధులు చేసిన ప్రతిభను గుర్తించారు. ఈ సదస్సులో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.

    కార్యక్రమ ప్రారంభంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ స్వాగత ఉపన్యాసం చేస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్
    లోక్‌సభ

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    పార్లమెంట్

    Mp's Suspension : ఎంపీల సస్పెన్షన్‌పై పాదయాత్ర.. ప్లకార్డులతో హోరెత్తిస్తోన్న ప్రతిపక్ష నేతలు లోక్‌సభ
    MPs suspended: లోక్‌సభ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్.. 146కు చేరిన సంఖ్య  భారతదేశం
    Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా  బంగ్లాదేశ్
    Parliament Budget Session: జనవరి 31- ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు  తాజా వార్తలు

    లోక్‌సభ

    Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా ఎన్నికల సంఘం
    TMC candidates: పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ పశ్చిమ బెంగాల్
    Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ  పశ్చిమ బెంగాల్
    Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025