Page Loader
Panchayat Parliament 2.0: లోక్‌సభలో నేడు పంచాయత్‌ సే పార్లమెంట్‌ 2.0 ప్రారంభం
లోక్‌సభలో నేడు పంచాయత్‌ సే పార్లమెంట్‌ 2.0 ప్రారంభం

Panchayat Parliament 2.0: లోక్‌సభలో నేడు పంచాయత్‌ సే పార్లమెంట్‌ 2.0 ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంట్ సెషన్లు, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన 'పంచాయత్‌ సే పార్లమెంట్‌ 2.0' కార్యక్రమం ఇవాళ లోక్‌సభలో ప్రారంభం కానుంది. గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా, ఈ అవగాహన కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన షెడ్యూల్డ్‌ తెగల 502 మంది మహిళా ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో మహిళా ప్రతినిధులు కొత్త పార్లమెంట్ భవనం, సంవిధాన్‌ సదన్, ప్రధాన మంత్రి సంగ్రహాలయం, రాష్ట్రపతి భవన్‌లను సందర్శిస్తారు.

Details

స్వాగత ఉపన్యాసం ఇవ్వనున్న ఉత్పల్ కుమార్ సింగ్

షెడ్యూల్డ్ తెగల నుంచి ఎన్నికైన మహిళా ప్రతినిధులకు నాయకత్వ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, రాజ్యాంగ నిబంధనలు, పార్లమెంటరీ విధానాలు, పాలనపై అవగాహన పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణాభివృద్ధి, విద్య, ఇతర రంగాల్లో షెడ్యూల్డ్ తెగల మహిళా ప్రతినిధులు చేసిన ప్రతిభను గుర్తించారు. ఈ సదస్సులో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. కార్యక్రమ ప్రారంభంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ స్వాగత ఉపన్యాసం చేస్తారు.