NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఫిర్యాదుల స్వీకరణకు పోలీసు శాఖ కొత్త పంథా.. కాగిత రహితంగా ఫిర్యాదుల స్వీకరణ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఫిర్యాదుల స్వీకరణకు పోలీసు శాఖ కొత్త పంథా.. కాగిత రహితంగా ఫిర్యాదుల స్వీకరణ
    ఫిర్యాదుల స్వీకరణకు పోలీసు శాఖ కొత్త పంథా.. కాగిత రహితంగా ఫిర్యాదుల స్వీకరణ

    Andhrapradesh: ఫిర్యాదుల స్వీకరణకు పోలీసు శాఖ కొత్త పంథా.. కాగిత రహితంగా ఫిర్యాదుల స్వీకరణ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 27, 2025
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పోలీసు శాఖ ఇప్పుడు ఫిర్యాదుల స్వీకరణలో కొత్తగా ఒక ఆధునిక విధానాన్ని ప్రవేశపెడుతోంది.

    బాధితులు తమ సమస్యలు వెల్లడించే సమయంలో,ఆ వివరాలను కృత్రిమ మేధస్సు(ఏఐ) సాంకేతికత సాయంతో వెంటనే రికార్డు చేసి, ఫిర్యాదుగా మలిచే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు.

    ఈవిధానాన్ని రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

    సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా,ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో తొలిసారిగా ఈ ఏఐ సేవలను ప్రారంభించారు.

    కార్యాలయ రిసెప్షన్ వద్దకు వచ్చిన బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అక్కడ ఏర్పాటు చేసిన ఏఐ బోట్‌కు చెబుతారు.

    ఇదివెంటనే పోలీసు సిబ్బంది నియంత్రణలో ఉండే సిస్టంలో ఫిర్యాదుగా నమోదు అవుతుంది. మొత్తం వ్యవస్థ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంటుంది.

    వివరాలు 

    ప్రాంతీయ భాషలో సంబంధిత ప్రశ్నలు 

    ఈ విధానం ద్వారా వృద్ధులు, చదువు లేనివారు, లేదా ఫిర్యాదును స్వయంగా రాయలేని వ్యక్తులు తమ సమస్యను సులభంగా తెలపగలుగుతారు.

    బాధితులు మాట్లాడే సమయంలో ఏఐ బోట్‌ సంబంధిత ప్రశ్నలను ప్రాంతీయ భాషలో అడుగుతుంది.

    బాధితులు వాటికి సమాధానాలు ఇవ్వడం ద్వారా వారి సమస్య సమగ్రంగా నమోదు అవుతుంది.

    ఈ విధానం పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో ఉండి, ఎటువంటి కాగితాలు అవసరం లేకుండా పనిచేస్తుంది.

    వివరాలు 

    వేగంగా, పారదర్శకంగా.. బాధితులకు న్యాయం  

    ఈ కొత్త డిజిటల్ విధానం ప్రధానంగా పారదర్శకతను,బాధ్యతాయుతమైన పోలీసు విధానాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడనుంది.

    ప్రభుత్వం ఈ ప్రణాళికను పైలట్ ప్రాజెక్టుగా ఏలూరు జిల్లాలో ప్రారంభించడంతో, ఇది ప్రతిష్ఠాత్మకంగా భావించబడుతోంది.

    ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, బాధితులకు త్వరిత న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏలూరు

    తాజా

    Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే? బంగారం
    Child Marriage: బాల్య వివాహాలను నిరోధించే బిల్లుకు అధ్యక్షుడు జర్దారీ గ్రీన్ సిగ్న‌ల్‌ పాకిస్థాన్
    PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ
    Bhairavam Review: 'భైరవం' రివ్యూ.. ముగ్గురు హీరోలు ఎలా చేశారంటే? మంచు మనోజ్

    ఏలూరు

    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు సికింద్రాబాద్
    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి  అమెరికా
    ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025