NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pariksha Pe Charcha 2025: పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీతో ఈసారి బాలీవుడ్‌ నటులు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pariksha Pe Charcha 2025: పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీతో ఈసారి బాలీవుడ్‌ నటులు
    పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీతో ఈసారి బాలీవుడ్‌ నటులు

    Pariksha Pe Charcha 2025: పరీక్షా పే చర్చలో ప్రధాని మోదీతో ఈసారి బాలీవుడ్‌ నటులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2025
    11:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యార్థుల్లో పరీక్షల విషయమైన భయాన్ని తొలగించడానికి ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి 'పరీక్షా పే చర్చ' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

    ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 10న దిల్లీలోని భారత్‌ మండపం టౌన్‌ హాల్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.

    అయితే, ఈసారి ఇది కొత్త పద్ధతిలో, సరికొత్త ఫార్మాట్‌లో నిర్వహించబడనుందని సమాచారం.

    ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బాలీవుడ్‌ నటీనటులు, ఇతర ప్రముఖులు కూడా ఇందులో పాల్గొననున్నట్లు అధికారులు ప్రకటించారు.

    వివరాలు 

     2025 కోసం గతేడాది డిసెంబర్‌ 14న రిజిస్ట్రేషన్లు 

    సద్గురు జగ్గీ వాసుదేవ్‌, నటీమణి దీపికా పదుకొణె, విక్రాంత్‌ మస్సే, భూమి పడ్నేకర్‌, దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌, పారా అథ్లెట్‌ అవని లేఖరా, రచయిత రుజుతా దివేకర్‌, ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ రాధికా గుప్తా, మానసిక నిపుణురాలు సోనాలీ సబర్వాల్‌, ఫుడ్‌ ఫార్మర్‌ రేవంత్‌ హిమత్‌సింగ్కా, టెక్నికల్‌ గురూజీ గౌరవ్‌ చౌధరీ వంటి ప్రముఖులు తమ పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్స్‌ను విద్యార్థులతో పంచుకోనున్నారు.

    వారు తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకుని వారిలో స్ఫూర్తి నింపగలుగుతారు.

    పరీక్షా పే చర్చ 2025 కోసం గతేడాది డిసెంబర్‌ 14న రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

    వివరాలు 

    విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలు

    జనవరి 24 ఉదయం 10 గంటల వరకు దేశవ్యాప్తంగా 9.72 లక్షల మంది విద్యార్థులు, 1.01 లక్షల మంది టీచర్లు, 24,289 మంది తల్లిదండ్రులు రిజిస్టర్‌ అయ్యారు.

    ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు 2500 మందిని ఎంపిక చేస్తారు, వారికి కేంద్ర విద్యాశాఖ నుంచి పీపీసీ కిట్‌లు అందజేస్తారు.

    పరీక్షా పే చర్చలో పాల్గొనేవారిని ఎంపిక చేసే ప్రక్రియలో https://innovateindia1.mygov.in/లో ఆన్‌లైన్ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు (MCQ) అడుగుతూ పోటీ నిర్వహిస్తారు.

    ఎంపికైన విద్యార్థులు ప్రధానితో నేరుగా చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు.

    ఈ చర్చలో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానాలు ఇస్తారు మరియు వారికి అవసరమైన సూచనలు అందిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    నరేంద్ర మోదీ

    Chandrababu: దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు చంద్రబాబు నాయుడు
    Atal Bihari Vajpayee: అటల్‌ బిహారి వాజ్‌పేయీ జయంతి.. రూ.వంద నాణేన్ని ఆవిష్కరించిన మోదీ ఇండియా
    Chandrababu: ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ చంద్రబాబు నాయుడు
    Khalistani Terrorist: ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులు.. గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025