Page Loader
Parliament Monsoon Session: రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Parliament Monsoon Session: రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 21 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఆగస్టు 12 నుంచి 18 వ తేదీ వరకు సభలకు విరామం ఇవ్వనున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం నిశ్చితార్థమైన పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులతో పాటు, కొత్తగా ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే కీలక బిల్లుల్లో గౌహతిలో ఒక కొత్త ఐఐఎమ్‌ను స్థాపించేందుకు గాను 'ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సవరణ బిల్లును ప్రభుత్వం ముందుకు తేనుంది.

Details

ముఖ్యమైన బిల్లులు చర్చకు వచ్చే అవకాశం

అలాగే జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, గనులు, ఖనిజాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ సవరణ బిల్లు" వంటి ప్రాముఖ్యమైన బిల్లులు చర్చకు రానున్నాయి. ఇక గతంలో లోకసభ, రాజ్యసభలలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేందుకు ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ది ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ది మర్చంట్ షిప్పింగ్ బిల్లు"లు లోకసభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు"లు రాజ్యసభ ఆమోదం పొందాల్సినవిగా ఉన్నాయి.

Details

పరిశీలనలో లోకసభ సెలెక్ట్ కమిటీ

అలాగే ది ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు" ప్రస్తుతం లోకసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో కొనసాగుతోంది. మొత్తంగా ఈ వర్షాకాల సమావేశాలు పలు కీలక చర్చలకు వేదిక కావడం ఖాయం. ప్రభుత్వానికి పార్లమెంటులో శాసన నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.