NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BJP MP: ఇలా అయితే పార్లమెంట్ మూసేయాలి.. సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    BJP MP: ఇలా అయితే పార్లమెంట్ మూసేయాలి.. సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం.. 
    అయితే పార్లమెంట్ మూసేయాలి.. సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం..

    BJP MP: ఇలా అయితే పార్లమెంట్ మూసేయాలి.. సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన అనంతరం,రాష్ట్రపతి సంతకంతో చట్టబద్ధమైన ''వక్ఫ్ సవరణ బిల్లు''పై వ్యతిరేకత వెల్లివిరిసింది.

    ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

    ఈ పిటిషన్లపై బుధవారం నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.

    ఈ బిల్లులో ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడం, అలాగే ''వక్ఫ్-బై-యూజర్'' అనే పద్ధతిలో ఉన్న ఆస్తులను డీనోటిఫై చేయడం వంటి కొన్ని నిబంధనలు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు.

    ఈ నేపథ్యంలో,తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ కౌన్సిల్స్‌లో ముస్లిమేతరుల నియామకాలు జరగవు అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.

    వివరాలు 

    సుప్రీంకోర్టు వ్యవహారంపై  బీజేపీ ఎంపీలు అసంతృప్తి

    అలాగే ఇప్పటికే నోటిఫై చేయబడ్డ లేదా నమోదు చేయబడ్డ వక్ఫ్-బై-యూజర్ ఆస్తులు సహా ఏ వక్ఫ్ ఆస్తినీ డీనోటిఫై చేయబోమని స్పష్టం చేసింది.

    ఈ సమయంలో జిల్లా కలెక్టర్లు వాటి స్థితిలో మార్పులు చేయరని తెలిపింది.

    ఈ హామీలన్నింటినీ సుప్రీంకోర్టు రికార్డు చేసింది. దీనితోపాటు, ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని (స్టేటస్ కో) ఆదేశాలు జారీ చేసింది.

    ఈ పరిణామాలపై బీజేపీకి చెందిన కొంతమంది ఎంపీలు సుప్రీంకోర్టు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ఈ సందర్బంగా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ చట్టాలు రూపొందించాలని భావిస్తే,పార్లమెంటు అవసరం ఏంటీ? అని ప్రశ్నించారు.

    వివరాలు 

    తదుపరి విచారణ మే 5న

    సుప్రీంకోర్టు చట్టాలు తయారుచేస్తే, పార్లమెంట్ భవనాన్ని మూసివేయాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ, పరోక్షంగా న్యాయవ్యవస్థపై విమర్శలు చేశారు.

    ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ స్పందనకు సుప్రీంకోర్టు వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ మే 5న జరగనుంది.

    1995లో అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టానికి 2025లో తెచ్చిన సవరణలు రాజ్యాంగానికి అనుకూలమా కాదా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

    ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా,న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం వరుసగా రెండవ రోజూ విచారించింది.

    బుధవారం జరిగిన విచారణలో చట్టంలోని పలు నిబంధనలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొన్ని నిబంధనలు రాజ్యాంగ సమీక్షకు తగనివే కావచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     నిశికాంత్ దూబే చేసిన ట్వీట్ 

    क़ानून यदि सुप्रीम कोर्ट ही बनाएगा तो संसद भवन बंद कर देना चाहिये

    — Dr Nishikant Dubey (@nishikant_dubey) April 19, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    బీజేపీ

    Awadhesh Prasad: 'రామ్, సీతా మీరు ఎక్కడ'?.. బోరున విలపించిన ఎంపీ అయోధ్య
    Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్..  సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు కర్ణాటక
    Telangana: 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ తెలంగాణ
    Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025