NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jagdeep Dhankhar: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jagdeep Dhankhar: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్
    మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్

    Jagdeep Dhankhar: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 22, 2025
    01:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదన్న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వ్యాఖ్యలు ఇటీవల తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

    తాజాగా ఆయన మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ సంబంధిత విషయాలలో ఎన్నికై వచ్చిన ప్రజాప్రతినిధులే 'చివరి అధికారం కలిగిన వారు' అంటూ ధన్‌ఖడ్ అన్నారు.

    మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    వివరాలు 

    రాజ్యాంగ సంబంధిత అంశాలలో ప్రజాప్రతినిధులే తుది నిర్ణయం

    "ప్రజలచే ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతగలవారిగా ఉండాలి. ప్రధానమంత్రి అయినా సరే, ఎమర్జెన్సీ విధించినప్పటికీ ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యానికి ఉంది. రాజ్యాంగ సంబంధిత అంశాలలో ప్రజాప్రతినిధులే తుది నిర్ణయం తీసుకునే అధికారులుగా ఉండాలి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా పార్లమెంట్ కంటే గొప్పదేది ఉందని పేర్కొనలేదు. పార్లమెంటే అత్యున్నతమైనది" అని తెలిపారు.

    ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలాన్ని కూడా ప్రస్తావించారు.

    ఆ సమయంలో పౌరుల ప్రాథమిక హక్కులు తీవ్రంగా హరించబడ్డాయని గుర్తుచేశారు.

    వివరాలు 

    చట్టాలు రూపొందించగలిగే న్యాయమూర్తులు మన వద్ద ఉన్నారు

    ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో,రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్దిష్ట కాల వ్యవధిలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

    ఈ తీర్పుపై స్పందించిన ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు. "రాష్ట్రపతికి గడువు విధించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై అణచివేత చూపించేలా సుప్రీంకోర్టు వ్యవహరించకూడదు. ఇప్పుడు చూస్తుంటే - చట్టాలు రూపొందించగలిగే న్యాయమూర్తులు మన వద్ద ఉన్నారు! అంతేకాక, కార్యనిర్వాహక బాధ్యతలు కూడా వారు తీసుకుంటున్నారు. వారంతా ఒక 'సూపర్ పార్లమెంట్'లా మారిపోతున్నారు. కానీ, వారిపై మాత్రం ఎలాంటి బాధ్యత ఉండదు. ఎందుకంటే, దేశ చట్టాలు వారికి వర్తించవు" అని వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    బీజేపీ నేతల వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు

    ఈ అంశంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి.

    "ఒకవేళ సుప్రీంకోర్టే చట్టాలు చేయాల్సి వస్తే, పార్లమెంట్ భవనాన్ని మూసివేయడమే సరైన పని" అని ఆయన అన్నారు.

    అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జగదీప్ ధన్కర్

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    జగదీప్ ధన్కర్

    Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ  ఉప రాష్ట్రపతి
    Dhankhar: రాహుల్ గాంధీపై ఉపరాష్ట్రపతి ధన్కర్ మండిపాటు రాహుల్ గాంధీ
    Rajyasabha: కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్లు.. సభ్యుల ఆందోళన  రాజ్యసభ
    Rajyasabha: రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025