సెప్టెంబర్లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 సమావేశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. ఐదు సిట్టింగ్లు ఉంటాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాన్ని 'ప్రత్యేక సమావేశం' అని పిలుస్తోంది. ఎజెండా ఏంటో తెలియరాలేదు. పార్లమెంట్ పాత భవనంలో ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇది లోక్సభ, రాజ్యసభల ఉమ్మడి సెషన్ కాకపోవచ్చు.అయితే, అజెండాలో అమృత్కాల్ వేడుకలు, భారతదేశాన్ని 'అభివృద్ధి చెందిన దేశం'గా చేర్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సెషన్ లో ముఖ్యమైన బిల్లు ఏవి ఆమోదం పొందే సూచన లేదు.