NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gram Sabha:13,326 పంచాయతీల్లో గ్రామసభలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
    తదుపరి వార్తా కథనం
    Gram Sabha:13,326 పంచాయతీల్లో గ్రామసభలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
    13,326 పంచాయతీల్లో గ్రామసభలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

    Gram Sabha:13,326 పంచాయతీల్లో గ్రామసభలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 22, 2024
    02:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    9 కోట్ల పనిదినాలతో 13,326 పంచాయతీల్లోని 87 ప్రాజెక్టుల పరిధిలో 57 లక్షల మందికి పనులు కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

    4500 కోట్ల నిధులతో నరేగా పనులు ప్రారంభించనున్నామని తెలిపారు.

    మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వికేంద్రీకృత పాలనకు పునాది అయిన పంచాయితీ రాజ్ వ్యవస్థను భారతదేశంలో అమలు చేస్తున్న రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు.

    ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో కొత్త దశకు గుర్తుగా రెండో తరం సంస్కరణల్లో భాగంగా రానున్న కార్యక్రమాలను వివరించారు.

    వివరాలు 

    ప్రాజెక్టుల పూర్తికి  నరేగా నిధుల వినియోగం 

    స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పంచాయతీ నిధుల నుంచి రూ. 240కోట్లు వివిధ ప్రాజెక్టులకు కేటాయిస్తామని తెలిపారు.

    జాతీయ ఉపాధిహామీ పథకంలో గత ప్రభుత్వం రూ.40,578కోట్లు ఖర్చు చేసిందని నివేదిస్తున్నారని.. కానీ దాని రిజల్ట్స్ ఎక్కడా క్షేత్ర స్థాయిలో కనపడటం లేదన్నారు.

    పంచాయతీలను బలోపేతం చేయటం తమ ప్రభుత్వ లక్ష్యం అని దేశ, రాష్ట్ర అభివృద్ధిలో పంచాయితీలు కీలకంగా మరాలనేది తన ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

    ఇంకా,87 ప్రాజెక్టుల పూర్తికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(NREGA)నిధులను కూడా వినియోగిస్తామని ఆయన ప్రకటించారు.

    కొన్ని పంచాయతీలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడకు విజిటింగ్ కోసం అందరూ వచ్చేలా చేద్దామని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.

    వివరాలు 

    గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటానికి చర్యలు

    కొన్ని పంచాయితీలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అరకు కాఫీ, లేపాక్షి, చేనేత, గ్రానైట్ వంటి వాటి వల్ల ఆయా పంచాయితీలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నా ఆయన యువత, మహిళలు గ్రామ సభల్లో పాల్గొనాలని కోరుతున్నామన్నారు.

    ఎన్నికల సమయంలో ఎలా తరలి వచ్చారో గ్రామ సభలకు కూడా అలానే రావాలి అని కోరుతున్నాన్నారు.

    పంచాయితీలకు చెందిన చాలా భూమి అనేక చోట్ల నిరుపయోగంగా ఉన్నాయని గ్రామాల్లోకి రాగానే చెత్తా చెదారం కనపడుతోందన్నారు.

    గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్

    తాజా

    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి
    CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..! ఆపరేషన్‌ సిందూర్‌

    పవన్ కళ్యాణ్

    Subhashree Bigg Boss: పవర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్టు! టాలీవుడ్
    దిల్లీకి పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తుపై చర్చ  తెలంగాణ
    వరుణ్-లావణ్య పెళ్లి కోసం ఇటలీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ  వరుణ్ తేజ్
    చంద్ర‌బాబు నాయుడును పరామర్శించిన పవన్ కళ్యాణ్  చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025