NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం 
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం 
    భారతదేశం

    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 30, 2023 | 01:16 pm 1 నిమి చదవండి
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం 
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం

    కొన్నేళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఢీ అంటే ఢీ అంటున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పార్టీ గెలుపుకోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెసి వేణుగోపాల్ తెలిపారు. గెహ్లాట్, పైలట్‌లను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం దిల్లీకి పిలుపించుకున్నారు. ఇద్దరితో విడివిడిగా చర్చించారు. అనంతరం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. దాదాపు నాలుగు గంటల చర్చల అనంతరం ఇద్దరు కలిసి పని చేస్తామనే ఒప్పందానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలియి.

    కర్ణాటక ఫలితాల స్ఫూర్తితో చేతుల కలిపిన నేతలు

    అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చాలనే విషయాన్ని మాత్రం అధిష్టానం వెల్లడించలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఏం చేయాలనే నిర్ణయాన్ని మాత్రం ఇద్దరు నేతలు అధిష్టానానికే వదిలేసినట్లు కెసి వేణుగోపాల్ తెలిపారు. రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య వివాదం పార్టీకి నష్టాన్ని కలిగించే విధంగా ఉండటంతో అధిష్టానం అలర్ట్ అయ్యింది. అందుకే ఎన్నికల సమయం దగ్గర పడటంతో నివారణ చర్యలను చేపట్టింది. కర్ణాటకలో సిద్ధరామయ్య, డికె శివకుమార్ మధ్య జరిగిన శాంతి ఒప్పందం వల్ల జరిగిన ఫలితాల నుంచి గెహ్లాట్, పైలెట్ ప్రేరణ పొందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు 

    గత కొన్ని సంవత్సరాలుగా, అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలెట్ దీక్ష కూడా చేశారు. రాష్ట్రంలో బీజేపీ పాలనలో జరిగిన పేపర్ లీక్ స్కామ్‌పై చర్య తీసుకోవాలని సొంత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ కూడా రాశారు. అంతేకాదు రాష్ట్రంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ సంఘర్ష్ యాత్రను సచిన్ ప్రారంభించారు. ఎన్నికల వేళ, ఈ వివాదానికి చెక్ పెట్టకుంటే, మరింత ముదిరే అవకాశం ఉందని, అది పార్టీ నష్టాన్ని కగిలిస్తుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇద్దరి నేతలతో చర్చలు జరిపింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రాజస్థాన్
    కాంగ్రెస్
    అశోక్ గెహ్లాట్
    తాజా వార్తలు
    దిల్లీ
    ఎన్నికలు

    రాజస్థాన్

    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ అశోక్ గెహ్లాట్
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి యుద్ధ విమానాలు

    కాంగ్రెస్

    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్ నరేంద్ర మోదీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  రాహుల్ గాంధీ

    అశోక్ గెహ్లాట్

    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు ప్రధాన మంత్రి
    2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్ రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక దిల్లీ
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ

    దిల్లీ

    దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా‌  మనీష్ సిసోడియా
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  నరేంద్ర మోదీ
    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  భారతదేశం
    కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు  రెజ్లింగ్

    ఎన్నికలు

    టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక  టర్కీ
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం  తెలంగాణ
    అమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు కర్ణాటక
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023