NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం 
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం 
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం

    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం 

    వ్రాసిన వారు Stalin
    May 30, 2023
    01:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొన్నేళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఢీ అంటే ఢీ అంటున్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.

    వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పార్టీ గెలుపుకోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెసి వేణుగోపాల్ తెలిపారు.

    గెహ్లాట్, పైలట్‌లను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం దిల్లీకి పిలుపించుకున్నారు.

    ఇద్దరితో విడివిడిగా చర్చించారు. అనంతరం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు.

    దాదాపు నాలుగు గంటల చర్చల అనంతరం ఇద్దరు కలిసి పని చేస్తామనే ఒప్పందానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలియి.

    దిల్లీ

    కర్ణాటక ఫలితాల స్ఫూర్తితో చేతుల కలిపిన నేతలు

    అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చాలనే విషయాన్ని మాత్రం అధిష్టానం వెల్లడించలేదు.

    వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఏం చేయాలనే నిర్ణయాన్ని మాత్రం ఇద్దరు నేతలు అధిష్టానానికే వదిలేసినట్లు కెసి వేణుగోపాల్ తెలిపారు.

    రాజస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య వివాదం పార్టీకి నష్టాన్ని కలిగించే విధంగా ఉండటంతో అధిష్టానం అలర్ట్ అయ్యింది.

    అందుకే ఎన్నికల సమయం దగ్గర పడటంతో నివారణ చర్యలను చేపట్టింది.

    కర్ణాటకలో సిద్ధరామయ్య, డికె శివకుమార్ మధ్య జరిగిన శాంతి ఒప్పందం వల్ల జరిగిన ఫలితాల నుంచి గెహ్లాట్, పైలెట్ ప్రేరణ పొందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    రాజస్థాన్

    అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు 

    గత కొన్ని సంవత్సరాలుగా, అశోక్ గెహ్లాట్-సచిన్ పైలట్ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

    ఇటీవల ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలెట్ దీక్ష కూడా చేశారు.

    రాష్ట్రంలో బీజేపీ పాలనలో జరిగిన పేపర్ లీక్ స్కామ్‌పై చర్య తీసుకోవాలని సొంత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ కూడా రాశారు.

    అంతేకాదు రాష్ట్రంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ సంఘర్ష్ యాత్రను సచిన్ ప్రారంభించారు.

    ఎన్నికల వేళ, ఈ వివాదానికి చెక్ పెట్టకుంటే, మరింత ముదిరే అవకాశం ఉందని, అది పార్టీ నష్టాన్ని కగిలిస్తుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇద్దరి నేతలతో చర్చలు జరిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    కాంగ్రెస్
    అశోక్ గెహ్లాట్
    తాజా వార్తలు

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    కాంగ్రెస్

    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య శరద్ పవార్
    బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ దిగ్గజ నేత వారసుడు బీజేపీ
    'జడ్జి నాలుక నరికేస్తా'; రాహుల్ గాంధీని దోషిగా తేల్చిడంపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ
    రాహుల్ గాంధీ విదేశాల్లో కలిసే 'అవాంఛనీయ వ్యాపారులు' ఎవరు? రాహుల్ గాంధీ

    అశోక్ గెహ్లాట్

    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ రాజస్థాన్
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ

    తాజా వార్తలు

    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  బ్రిటన్
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల నరేంద్ర మోదీ
    'మెటా'లో మరో విడత ఉద్యోగుల తొలగింపు; లిస్ట్‌లో భారత్‌లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు  మెటా
    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  రిషి సునక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025