NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra News: వేసవిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్‌ విధానం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra News: వేసవిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్‌ విధానం
    వేసవిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్‌ విధానం

    Andhra News: వేసవిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్‌ విధానం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 11, 2025
    11:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది గరిష్ట గ్రిడ్ డిమాండ్‌ 13,347 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది.

    ప్రస్తుతం ఫిబ్రవరి 4న నమోదైన 12,652 మెగావాట్లు అత్యధికంగా నమోదైన డిమాండ్‌.

    అయితే,మార్చి,ఏప్రిల్ నెలల్లో దీని కంటే అధికంగా డిమాండ్ నమోదవుతుందని, కృత్రిమ మేధ (ఏఐ) విశ్లేషణ ఆధారంగా ఇంధన శాఖ అంచనా వేసింది.

    విద్యుత్‌ సంస్థలు ఏఐ సాంకేతికతను ఉపయోగించి రాబోయే విద్యుత్‌ అవసరాలను 96-98% ఖచ్చితత్వంతో ముందుగా అంచనా వేయగలవని స్పష్టంగా తెలియజేశాయి.

    ఈ అంచనాల ప్రకారం,వచ్చే ఆరు నెలల్లో విద్యుత్‌ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకునే సమర్థ్యాన్ని అంచనా వేసి,వేసవి కాలంలో సమయాన్నిబట్టి డిమాండ్‌ తేడాలను నిర్ధారించాయి.

    దీని ప్రకారం,అవసరమైన విద్యుత్‌ను ముందుగానే సమకూర్చుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాయి.

    వివరాలు 

    25 ఏళ్ల డేటా ఆధారంగా విశ్లేషణ 

    గత 25 సంవత్సరాల వాతావరణ డేటా, సెలవులు, కోవిడ్‌ లాక్‌డౌన్ ప్రభావం, వాతావరణ సూచనలు, మరియు సీజనల్ సమాచారం ఆధారంగా విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసే మెరుగైన వ్యవస్థను అభివృద్ధి చేశారు.

    దీని ద్వారా రేపటి విద్యుత్ వినియోగాన్ని టైం బ్లాక్‌ల వారీగా ముందే అంచనా వేయగల అవకాశముంది.

    విద్యుత్ స్వాపింగ్ విధానం

    కొన్ని ప్రత్యేక సమయాల్లో (15 నిమిషాల వ్యవధి = ఒక టైం బ్లాక్‌) విద్యుత్ సంస్థలు స్వాపింగ్ పవర్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించాయి.

    స్వాపింగ్ అంటే ఇతర రాష్ట్రాల్లోని అదనపు విద్యుత్‌ను తాత్కాలికంగా వినియోగించుకుని, అవసరమైన సమయంలో తిరిగి అందించడం.

    వివరాలు 

    పునరుత్పాదక విద్యుత్తుతో మిగులు ఉత్పత్తి 

    ఈ విద్యుత్‌ కొనుగోలు ఖర్చును తగ్గించుకోవడానికి ఉత్తరాది రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్ నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ను ఉదయం, సాయంత్రం అత్యధిక డిమాండ్ సమయంలో తీసుకునేందుకు విద్యుత్‌ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.

    ప్రస్తుతం వివిధ వనరుల నుంచి అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి మొత్తం 21,728 మెగావాట్లు.

    ఇందులో సుమారు 50% పునరుత్పాదక విద్యుత్‌ ద్వారా వస్తోంది.అయితే,వాతావరణ మార్పుల వల్ల పునరుత్పాదక విద్యుత్ నిరంతరాయంగా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.

    దీనివల్ల నిరంతర విద్యుత్‌ అవసరాలను తీర్చడం సవాలుగా మారింది.కొన్నిటైం బ్లాక్‌లలో మిగులు విద్యుత్‌ ఉంటున్నప్పటికీ, మార్కెట్ నుండి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.

    వేసవి కాలంలో,ముఖ్యంగా పగటి వేళల్లో, విద్యుత్‌ డిమాండ్‌కు మించి సరఫరా అందుబాటులో ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Microsoft : మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్‌  మైక్రోసాఫ్ట్
    AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం హైకోర్టు
    Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ ఆస్ట్రేలియా
    Virat Kohli: ఐపీఎల్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పనున్నాడా..? అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలతో ఊహాగానాలు! విరాట్ కోహ్లీ

    ఆంధ్రప్రదేశ్

    Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం  చంద్రబాబు నాయుడు
    AP Tourism Investments: రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు  భారతదేశం
    CM Chandrababu: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి  భారతదేశం
    Nara Lokesh: ప్రతి శనివారం 'నో బ్యాగ్‌ డే'.. విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమం నారా లోకేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025