NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Elections 2024: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్‌ .. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
    తదుపరి వార్తా కథనం
    Elections 2024: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్‌ .. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
    ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్‌ .. ఓటు వేసిన ప్రముఖులు వీరే..

    Elections 2024: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్‌ .. ఓటు వేసిన ప్రముఖులు వీరే..

    వ్రాసిన వారు Stalin
    May 13, 2024
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతుండగా.. 10రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

    ఈక్రమంలోనే ఉదయం నుండే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూ లైన్లలో నిలుచుంటున్నారు.

    ఎండ వస్తే తట్టుకోలేమని భావించిన ఓటర్లు..ఉదయం 7గంటల లోపే పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు.

    ఇక హైదరాబాద్‌లో పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి వచ్చి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు.

    సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    Details 

    ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసిన ప్రముఖులు వీరే..

    హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థి మాధవీలత,ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు.

    మెగాస్టార్ చిరంజీవి,అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    ఆంధ్రప్రదేశ్,మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్,ఆయన భార్య నారా బ్రాహ్మణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం 138 పోలింగ్‌ బూత్‌లో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఎన్నికలు

    Pakistan poll result: లండన్ ప్లాన్ విఫలమైంది: ఇమ్రాన్ ఖాన్ 'విక్టరీ' స్పీచ్  ఇమ్రాన్ ఖాన్
    Pakistan election: నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు  పాకిస్థాన్
    PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్  చండీగఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025