NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్ 
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్ 
    మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్

    మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్ 

    వ్రాసిన వారు Stalin
    Sep 26, 2023
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే.

    తాజాగా వారు శవాలై కనిపించారు. వీరిద్దరి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే వీరు హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

    ఇద్దరూ మెయిటీ కమ్యూనిటీకి చెందిన హిజామ్ లింతోఇంకాంబి అనే అమ్మాయి, ఫిజామ్ హేమ్‌జిత్ అనే అబ్బాయి. వారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు సమాచారం.

    చనిపోయిన బాలిక వయసు 17 ఏళ్లు కాగా, యువకుడి వయసు 20 ఏళ్లు.

    మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన రోజే విద్యార్థుల చనిపోయిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టనుంది. అయితే మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు.

    మణిపూర్

    మృతదేహాల వెనుక తుపాకులతో ఇద్దరు సాయుధులు

    సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫొటోల్లో విద్యార్థులిద్దరి మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. ఇందులో బాలుడి తల తెగిపోయింది.

    వైరల్ అవుతున్న ఫొటోల్లో ఇద్దరు తుపాలకు సాయుధలైన వారు వారి వెనక ఉన్నట్లు కనిపించింది.

    వారు కనిపించకుండా పోయినప్పుడు లిన్‌థోఇంకాంబి తెల్లటి టీషర్ట్‌, హేమ్‌జిత్‌ చెక్‌ టీషర్ట్‌ ధరించి ఉన్నారు.

    అదే సమయంలో ఈ ఘటన పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ కేసును చేధించడానికి పోలీసులు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    సైబర్‌సెల్ సహాయంతో చిత్రంలో వారి వెనుక కనిపించిన సాయుధ వ్యక్తులను కనుగొనడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    తాజా వార్తలు
    ఇంటర్నెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మణిపూర్

    Manipur violence: మణిపూర్‌లో మరోసారి విధ్వంసం, భద్రతా దళాల బస్సులకు నిప్పు తాజా వార్తలు
    మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు కేంద్రమంత్రి
    మణిపూర్ అమానుష వైరల్ వీడియో కేసు సీబీఐ చేతికి.. సుప్రీంకు కేంద్రం వివరణ సుప్రీంకోర్టు
    మహిళలను గౌరవించకపోతే దేశం పురోగమించదు.. బీజేపీ అధికార దాహంతో ఆటలాడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మద్దతు.. సీ ఓటర్ సర్వేలో వెల్లడి చంద్రబాబు నాయుడు
    చైనాకు చెక్ పెట్టేందుకు.. అరుణాచల్‌లో 300 కిలోమీటర్ల సరిహద్దు రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్  అరుణాచల్ ప్రదేశ్
    AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే  ఆంధ్రప్రదేశ్
    'అప్రమత్తంగా ఉండండి'.. కెనడాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు కెనడా

    ఇంటర్నెట్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు శ్రీనగర్
    హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ  హర్యానా
    Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత  హర్యానా
    TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు  టీఎస్ఆర్టీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025