NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు
    శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు

    Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 19, 2024
    04:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీసిటిలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

    పారిశ్రామిక వేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

    పెట్టుబడులు తెచ్చేందుకు పలు దేశాల్లో పర్యటించానని, భారత్‌ను ఐటీ, ప్రపంచపటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు.

    ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉన్నారని, ఇందులోని ప్రతి నలుగురిలో ఒక ఏపీ వ్యక్తి ఉండడం గర్వకారణమన్నారు.

    Details

    ఎకనామిక్ జోన్ గా మార్చేందుకు కృషి

    ప్రస్తుతం శ్రీసిటిలో 8వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఉండగా, తాజాగా సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్‌లు వచ్చాయి.

    ఇక ఈ ప్రాంతంలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉందని, ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు.

    4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం గొప్ప విషయమన్నారు.

    శ్రీ సిటిని అత్యుత్తమ ఎకనామిక్ జోన్‌గా తయారు చేయాలనేది తన లక్ష్యమన్నారు.

    Details

    2029 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    శ్రీసిటికి అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయి, అయితే నివాసయోగ్య ప్రాంతంగా మార్చడానికి కృషి చేస్తాం.

    ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించుకొనే విధంగా ప్రభుత్వం చర్యలను చేపడుతుంది.

    ఇదిలా ఉండగా రాజధాని కోసం 29వేల మంది రైతులు 34వేల ఎకరాల భూమి ఇచ్చారని, ప్రస్తుతం ఇంటింటికి తాగునీరు, విద్యుత్, ఫైబర్ నెట్ అందిస్తామన్నారు.

    2029 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    నెల్లూరు నగరం

    తాజా

    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు కీలక ప్రకటన  రాజ్యసభ
    TDP-Janasena-BJP: అమిత్‌షా,నడ్డాలతో చంద్రబాబు, పవన్‌ భేటీ.. నేడు పొత్తుపై చర్చ భారతదేశం
    బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ  పవన్ కళ్యాణ్
    Chandrababu Naidu: ఈ నెల 14న టిడిపి రెండో జాబితా: చంద్రబాబు భారతదేశం

    నెల్లూరు నగరం

    AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి రోడ్డు ప్రమాదం
    Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  జనసేన
    World's Most Expensive Cow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. వేలంలో 40కోట్లకు అమ్ముడుపోయింది  బ్రెజిల్
    Nellore: ఏమి పాపం చేశానమ్మా.. నెల్లూరు జిల్లాలో దారుణం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025