NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pm Modi: ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని సిక్కిం పర్యటన రద్దు.. బాగ్డోగ్రాలో వర్చువల్‌గా ప్రసంగం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pm Modi: ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని సిక్కిం పర్యటన రద్దు.. బాగ్డోగ్రాలో వర్చువల్‌గా ప్రసంగం 
    ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని సిక్కిం పర్యటన రద్దు.. బాగ్డోగ్రాలో వర్చువల్‌గా ప్రసంగం

    Pm Modi: ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని సిక్కిం పర్యటన రద్దు.. బాగ్డోగ్రాలో వర్చువల్‌గా ప్రసంగం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 29, 2025
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయులను విభజించాలనే ఉద్దేశంతో ముష్కరులు కుట్ర పన్నారని, అయితే వారికి భారత్‌ తగిన ప్రతిస్పందనను ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

    ఈ దాడి జరిగిన తరువాత దేశ ప్రజలు అనేక రకాల భిన్నతల మధ్య ఉన్నా, మునుపెన్నడూ లేనంతగా ఐక్యతను ప్రదర్శించారని ఆయన అన్నారు.

    పహల్గామ్‌ దాడి కేవలం భారతీయులపై చేసిన దాడి మాత్రమే కాకుండా, ఇది మానవత్వం, సోదరభావనలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

    అయితే 'ఆపరేషన్‌ సిందూర్‌' ద్వారా మన భద్రతా దళాలు ధైర్యంగా ఎదురొడి, పటిష్టమైన బదులిచ్చాయని మోదీ తెలిపారు.

    ఆయన పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా నుండి వర్చువల్‌ విధానంలో ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు.

    వివరాలు 

    వాతావరణ సమస్యలతో సిక్కిం పర్యటన రద్దు 

    ఈరోజు (గురువారం) ప్రధాని మోదీ సిక్కిం వెళ్లాల్సి ఉన్నా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటనను రద్దు చేయాల్సి వచ్చింది.

    సిక్కిం రాష్ట్ర అవతరణ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉన్న ప్రధాని, గ్యాంగ్‌టక్‌ చేరుకొని దాదాపు రూ. 750 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉండేది.

    కానీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ పర్యటన రద్దయింది. దీంతో బాగ్డోగ్రా నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

    వివరాలు 

    ప్రజాస్వామ్య యాత్రలో సిక్కిం స్వర్ణోత్సవం 

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సిక్కిం ప్రజాస్వామ్య ప్రయాణం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ రోజు సువర్ణోత్సవ దినంగా భావిస్తున్నానని తెలిపారు.

    తాను వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రజల మధ్య ఉండాలని ఆశించినా, ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా వరకు వచ్చాక వాతావరణం తనను సిక్కింకు వెళ్లనివ్వలేదని పేర్కొన్నారు. దీంతో అక్కడి ప్రజలను ప్రత్యక్షంగా కలవలేకపోయానని విచారం వ్యక్తం చేశారు.

    వివరాలు 

    అభినందనలు, అభివృద్ధిపై ప్రధాని అభిప్రాయాలు 

    సిక్కిం పథకం విజయవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చేసిన కృషిని ప్రధాని కొనియాడారు.

    రాష్ట్ర ప్రజలకు 50వ వార్షికోత్సవం సందర్భంగా తన శుభాకాంక్షలు తెలిపారు.

    50 ఏళ్ల క్రితం సిక్కిం ప్రజలు తమ ప్రజాస్వామ్య భవిష్యత్తు దిశను నిర్ణయించుకోవాలని నిర్ణయించుకుని భారతదేశంతో కలవాలని కోరుకున్నారన్నారు.

    ఈ రోజు సిక్కింలో ప్రతి కుటుంబం అభివృద్ధి మార్గంలో ఉందని తెలిపారు.

    సిక్కిం మొత్తం సేంద్రీయ వ్యవసాయాన్ని స్వీకరించిన రాష్ట్రంగా పేరొందిందని, అది సాంస్కృతిక మరియు వారసత్వ విలువల ప్రతీకగా ఎదిగిందని చెప్పారు.

    వివరాలు 

    ఈశాన్య అభివృద్ధికి కేంద్ర బిందువుగా.. 

    2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత "సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌" అనే నినాదంతో ముందుకెళ్లామని మోదీ గుర్తుచేశారు.

    ఇదే దిశగా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి కేంద్రముగా మార్చే ప్రయత్నం చేశామని తెలిపారు.

    ఈ రోజు సిక్కింలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం ద్వారా నవ భారత నిర్మాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    సిక్కిం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    PM Modi: నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ భేటీ.. అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భారతదేశం
    PM Modi: రష్యా వేడుకలకు హాజరుకాని మోదీ.. భారత కూటమి వైఖరికి సంకేతమా? ఇండియా
    PM Modi: ముంబయి వేదికగా 'వేవ్స్‌' 2025ను ప్రారంభించిన మోదీ భారతదేశం
    PM Modi: అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి: మోదీ అమరావతి

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది భారతదేశం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025