NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం 
    తదుపరి వార్తా కథనం
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం 
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం

    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం 

    వ్రాసిన వారు Stalin
    Jul 26, 2023
    01:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నయి.

    ఈ క్రమంలో రామ మందిర నిర్మాణంలో భాగంగా మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది.

    ఆలయ గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనపై ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది.

    వచ్చే ఏడాది జనవరిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని యోచిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వాన పత్రిక పంపినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

    వచ్చే ఏడాదిలో జనవరి 15 నుంచి 24 మధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగొచ్చని ట్రస్ట్ నిర్వాకులు పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి షెడ్యూల్ ప్రకారం తేదీని ఖరారు చేయనున్నారు.

    మోదీ

    జైపూర్‌లో విగ్రహ తయారు

    విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తేదీలపై, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు.

    కచ్చితమైన తేదీని ప్రధాని మోదీ నిర్ణయిస్తారని చెప్పారు. అయితే అది జనవరి 15 -24 మధ్యనే ఉంటుందని స్పష్టం చేశారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కొంత సమయం కేటాయించాలని ప్రధాని మోదీకి ట్రస్ట్ నిర్వాహకులు ఈ మేరకు లేఖ రాశారు.

    ప్రధాని రాకతో ఈ వేడుక ప్రాధాన్యత మరింత పెరుగుతుందని ఆ లేఖలో వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ మాజీ సర్కార్యవాహ్ సురేశ్ భయ్యా జీ జోషికి కూడా ఆహ్వాన లేఖ పంపారు.

    శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు ఆగస్ట్‌లో జైపూర్‌ వెళ్లి పార్కోట్‌లో తయారు చేయనున్న విగ్రహాలను ఎంపిక చేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    శ్రీరాముడు
    తాజా వార్తలు
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు

    శ్రీరాముడు

    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా

    తాజా వార్తలు

    Apple Iphone: 2023లో 8-9 మిలియన్ ఐఫోన్‌లను అమ్మడమే యాపిల్ టార్గెట్ ఐఫోన్
    అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ రికార్డ్: సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్లు అమ్మిన అమెజాన్  అమెజాన్‌
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    Maharashtra: గేదెల గుంపు దాడిలో పులి మృతి; వీడియో వైరల్  మహారాష్ట్ర

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు  హత్య
    భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు తాజా వార్తలు
    గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ  సుప్రీంకోర్టు
     అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్య ఎఫెక్ట్; ఐదుగురు యూపీ పోలీసులు సస్పెండ్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025