భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరస రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ను మరోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు భోపాల్లోని జంబోరిలో జన్ ఆశీర్వాద్ యాత్ర సభలో ప్రసంగించిన ప్రధాని, మోదీ మూడ్, శ్రమ వేరని, మోదీ లక్ష్యం కూడా వేరేనన్నారు. తమకు దేశం, ప్రజల కంటే మించినది ఏదీ లేదన్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు జైపూర్ చేరుకోనున్నారు.అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. 3 గంటలకు నగర శివార్లలోని మైదానానికి చేరుకుని పరివర్తన్ సంకల్ప్ మహాసభలోనూ ప్రసంగం చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ కారణంగానే 45 రోజుల వ్యవధిలోనే మోదీ మూడోసారి ఎంపీలో పర్యటించారు.