PM Modi: గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లా లో ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ దేవాలయాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన సోమనాథ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం,సమీపంలోని జునాగఢ్ జిల్లాలో గల గిర్ వన్యప్రాణి అభయారణ్య ప్రధాన కేంద్రం సాసన్కు వెళ్లారు.
ఈ ప్రాంతం ఆసియా సింహాలకు పేరుగాంచిందని అందరికీ తెలిసిందే. సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా, సాసన్లో నిర్వహించనున్న నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్లైఫ్ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు.
అలాగే,ఆయన సింహాలను దగ్గరగా చూసేందుకు సందర్శనకు వెళతారు.
సోమనాథ్ పర్యటనకు ముందుగా,మోదీ జామ్నగర్ జిల్లాలోని జంతు రక్షణ,సంరక్షణ,పునరావాస కేంద్రం 'వన్తారా'ను సందర్శించారు.
వివరాలు
మోదీ గుజరాత్ పర్యటన
మూడురోజుల పర్యటనలో భాగంగా, శనివారం నుంచే మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు.
ఇటీవల, ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో మహా కుంభమేళా కోట్లాది మంది ప్రజల భాగస్వామ్యంతో ముగిసిందని మోదీ 'ఎక్స్'లో పేర్కొన్నారు.
మహా కుంభోత్సవం అనంతరం సోమనాథ్ ఆలయానికి వస్తానని సంకల్పించుకున్నానని, ఇప్పుడు ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్నానని ఆయన తెలిపారు.
దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు మోదీ పేర్కొన్నారు.