NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Narendra Modi: యువతకు,మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట..కేంద్ర బడ్జెట్‌పై నరేంద్ర మోదీ ప్రశంసలు
    తదుపరి వార్తా కథనం
    PM Narendra Modi: యువతకు,మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట..కేంద్ర బడ్జెట్‌పై నరేంద్ర మోదీ ప్రశంసలు
    యువతకు, మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట

    PM Narendra Modi: యువతకు,మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట..కేంద్ర బడ్జెట్‌పై నరేంద్ర మోదీ ప్రశంసలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 23, 2024
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్ సభలో ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు.

    ఈ బడ్జెట్ భారతదేశాన్ని సుసంపన్నం చేసి,యువత, మధ్య తరగతి ప్రజలకు కొత్త భరోసానిస్తుందని వ్యాఖ్యనించారు.

    ఈ బడ్జెట్ దేశాన్ని సుభిక్షం వైపు తీసుకెళ్తుందని, సమాజంలోని అన్ని వర్గాల వారికి భరోసానిస్తుందన్నారు.

    గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.

    details

    చిన్న పరిశ్రమలకు ప్రోత్సహాకాలు

    గిరిజనులు, దళితులు, వెనుకబడిన ప్రజలకు సాధికారత కల్పించేందుకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందించామన్నారు.

    మహిళల ఆర్థిక భాగస్వామ్యానికి ఈ బడ్జెట్ తోడ్పనుందన్నారు. ఈ బడ్జెట్‌తో వ్యాపారులు, చిన్న పరిశ్రమలు కొత్త పురోగమన బాట పడతాయని మోదీ అన్నారు.

    ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.

    బడ్జెట్‌లో ఉత్పత్తితో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. ఇది ఆర్థికాభివృద్ధికి సాయపడనుంది.

    Details

    ముద్రా రుణాలు రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు

    దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో నిరుద్యోగులకు అవకాశం కల్పించి, వారికి కొత్త అవకాశాల తలుపులు ఇవ్వనున్నారు.

    కొత్త ఉద్యోగులకు తొలి జీతం తమ ప్రభుత్వమే ఇస్తుందని, కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ అవకాశం, ఇంటర్న్‌షిప్‌ ద్వారా గ్రామీణులకు పెద్ద కంపెనీల్లో పనిచేసే వెసులుబాటు ఉండనుంది.

    గ్రామం నుంచి పట్టణాల వరకూ అందర్నీ వ్యాపారవేత్తలగా తీర్చిదిద్ది, ముద్రా రుణాల పరిధిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచామన్నారు.

    details

    కేంద్ర బడ్జెట్ రూ.48.21 లక్షల కోట్లు

    భారత్‌ను గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మార్చి, ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించేందుకు కొత్త పథకం తీసుకొస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

    మధ్య తరగతికి భరోసానిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు.

    ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ రూ.48.21 లక్షల కోట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్ 2024
    నిర్మలా సీతారామన్

    తాజా

    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా

    బడ్జెట్ 2024

    Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్  మధ్యంతర బడ్జెట్ 2024
    Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్  మధ్యంతర బడ్జెట్ 2024
    New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం  మధ్యంతర బడ్జెట్ 2024
    కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు రక్షణ

    నిర్మలా సీతారామన్

    బడ్జెట్ 2023-24లో వేటి ధరలు పెరిగాయి, ఏవి తగ్గాయి బడ్జెట్ 2023
    Msme Budget 2023: ఎంఎస్ఎంఈలకు పెద్ద ఊరట, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌కు రూ.9వేల కోట్లు బడ్జెట్ 2023
    బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు ఆటో మొబైల్
    Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025