Page Loader
PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ 
పరిశుభ్ర, ఆరోగ్య భారతం కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 01, 2023
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహాత్మగాంధీ జయంతి అక్టోబరు 2ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం శ్రమదానం చేశారు. ఫిట్‌నెస్‌ ట్రైనర్ అంకిత్‌ బైయాన్‌పురియాతో కలిసి పరిసరాల పరిశుభ్రతకు నడుం బిగించారు. స్వచ్ఛతాహి సేవాలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట శ్రమదానం చేయాలని నరేంద్ర మోదీ సూచించారు. ఈ క్రమంలోనే బైయాన్‌పురియాతో కలిసి చీపురు పట్టి చెత్త ఎత్తారు. దేశమంతా స్వచ్ఛతపై దృష్టిసారిస్తోందని,తాను బైయాన్‌పురియాతో కలిసి శ్రమదానం చేశానన్నారు. కేవలం పరిశుభ్రతే కాకుండా ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని కూడా ఇందులో భాగం చేశామన్నారు. స్వచ్ఛతా పరిశుభ్రత, ఆరోగ్య భారత సందేశాన్ని అందిస్తోందని, ఇదే స్వచ్ఛ్, స్వస్త్ భారత్ అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రమదానంలో పాల్గొన్న మోదీ