NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచద్దు.. 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచద్దు.. 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోదీ 

    PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచద్దు.. 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2024
    04:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పరీక్షలకు సిద్ధమవుతున్నయువకుల కోసం ఒత్తిడి లేని వాతావరణాన్నిసృష్టించే కార్యక్రమం ఏడవ ఎడిషన్ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాఠశాల విద్యార్థులతో సంభాషించారు.

    ఈసందర్భంగా పిల్లలకు ప్రధాని పలు సలహాలు,సూచనలిచ్చారు.పరీక్షల సమయంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదన్నారు.

    ఎదుగుదలకు పోటీ చాలా ముఖ్యం.అయితే స్నేహితుల మధ్య ఈ పోటీ ఆరోగ్యకరమైనదిగా ఉండాలని మోదీ అన్నారు.

    కుటుంబ పరిస్థితులలో తరచుగా అనారోగ్యకరమైన పోటీ బీజాలు నాటడం వల్ల తోబుట్టువుల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడుతుందని ఆయన సూచించారు.

    అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చవద్దని కోరారు.తమ పిల్లలు సాధించిన విజయాలను వారి విజిటింగ్ కార్డ్‌గా చేసుకోవద్దని కూడా ఆయన కోరారు.

    Details 

    పరీక్షలలో ముందుగానే ప్రశ్నపత్రాన్ని చదవాలి: మోదీ 

    విద్యార్థులను ప్రేరేపించడంలో ఉపాధ్యాయుల పాత్రపై దృష్టి సారించిన ప్రధాన మంత్రి, ఒక తరగతికి మాత్రమే కాకుండా మొత్తం పాఠశాలకు చెందిన విద్యార్థుల ఒత్తిడిని తగ్గించే సామర్థ్యం వారికే ఉందని నొక్కి చెప్పారు.

    ఇతర పిల్లలను పోలుస్తూ తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే రన్నింగ్ కామెంట్రీతో విద్యార్థులు ప్రతికూల ఆలోచనల్లోకి వెళ్తారని అన్నారు.

    కొత్త బట్టలు, ఆచారాలు లేదా స్టేషనరీలతో పరీక్ష రోజును అతిగా హైప్ చేయవద్దని ఆయన తల్లిదండ్రులను కోరారు.

    ఆఖరి క్షణంలో భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు ప్రశ్నపత్రాన్ని చదవాలని, సమయ కేటాయింపుతో ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రధాని వారికి సూచించారు.

    Details 

    కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌లో 'పరీక్షా పే చర్చ'

    ఇప్పటికీ చాలా వరకు పరీక్షలు రాస్తున్నారని, కంప్యూటర్లు, ఫోన్ల వల్ల రాసే అలవాటు తగ్గుతోందని విద్యార్థులకు ప్రధాని గుర్తు చేశారు.

    రాయడం అలవాటు చేసుకోవాలని కోరారు. చదివే/చదువుకునే సమయంలో 50 శాతం రాయడానికి కేటాయించాలని కోరారు. మీరు ఏదైనా వ్రాసినప్పుడు మాత్రమే మీరు దానిని నిజంగా అర్థం చేసుకుంటారని, ఇతర విద్యార్థుల వేగాన్ని చూసి భయపడవద్దని వారిని కోరారు.

    ప్రధాని మోదీ ఈ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో నాలుగో ఎడిషన్‌ మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహించారు.

    ప్రతి ఏడాది ఈ ప్రోగ్రామ్‌కు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సంవత్సరం 2.26 కోట్ల మంది విద్యార్థులు దీనికి నమోదు చేసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    PM Modi: పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ  గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే? ఎయిర్ ఇండియా
    Modi Ayodhya Visit: నేడు అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌‌ను ప్రారంభిచనున్న ప్రధాని మోదీ  అయోధ్య
    PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025