NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై మోదీ కీలక వ్యాఖ్యలు

    ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 18, 2023
    01:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు 2023 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఏపీ విభజనను ప్రస్తావించిన మోదీ తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తం ఏరులై పారిందని(విద్యార్థుల ఆత్మబలిదానాలు) మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

    రాష్ట్ర విభజన రెండు రాష్ట్రాలను సంతృప్తిపరచలేకపోయిందన్నారు. తెలంగాణ వాసులకు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా, సంబురాలు చేసుకోలేకపోయిందన్నారు.

    ఎన్డీఏ హయాంలో ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ విభజనలు జరిగాయని, వాటిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదన్నారు.

    ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాసులు అసంతృప్తికి గురయ్యారని మోదీ అన్నారు.

    DETAILS

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ భవనంలోనే జరిగింది : మోదీ

    నేటి నుంచి 5రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతాయి. నేడు పార్లమెంట్‌ పాత భవనంలోనే సమావేశాలు జరుగుతున్నాయి. మంగళవారం నుంచి సభా వ్యవహారాలు కొత్త భవనంలోకి మారనున్నాయి.

    ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రస్తావించారు. పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

    ఈ క్రమంలోనే పాత భవనంలో పలు జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు.ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్నీ సైతం ప్రస్తావించారు.

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ భవనంలోనే జరిగిందన్నారు. బీజేపీ హయాంలో చేసిన మూడు రాష్ట్రాల విభజనలో అన్ని చోట్లా సంబరాలు జరిగితే ఏపీ విభజన మాత్రం సరిగ్గా జరగక ఇరు రాష్ట్రాలు అసంతృప్తికి గురయ్యాయన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    నరేంద్ర మోదీ
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం అమృత్‌సర్
    Gold Rates: ఒక్కరోజులోనే షాక్.. బంగారం ధర రూ.2,400 పెంపు బంగారం
    MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ ముంబయి ఇండియన్స్
    Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం.. తమిళనాడు

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ

    నరేంద్ర మోదీ

    వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదనే రిసీవ్ చేసుకోవడానికి రావొద్దని చెప్పాను: కాంగ్రెస్ విమర్శలకు మోదీ జవాబు  బెంగళూరు
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ  దిల్లీ
    చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి: స్వామి చక్రపాణి మహారాజ్  చంద్రుడు
    మోదీకి పుతిన్ ఫోన్.. G20 సమ్మిట్‌కు రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ వ్లాదిమిర్ పుతిన్

    తెలంగాణ

    DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్   ప్రభుత్వం
    ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్: తెలంగాణలో అమలు కానున్న కొత్త నిబంధన!  ఆటో
    Patnam Mahender reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి ప్రభుత్వం
    ఖరారైన తెలంగాణ అమిత్ షా పర్యటన.. టూర్ వివరాలు ఇవే  అమిత్ షా

    ఆంధ్రప్రదేశ్

    Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత! పెద్దపల్లి
    వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు బైబై.. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తానని జోస్యం యార్లగడ్డ వెంకట్రావు
    పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి  బస్సు ప్రమాదం
    Uravakonda: ఉరవకొండ ఓటరు జాబితా అవకతవకలు.. మరో అధికారిపై సస్పెన్షన్ వేటు  ఉరవకొండ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025