NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. పార్లమెంటులో అవిశ్వాసంపై మూడో రోజు చర్చ
    తదుపరి వార్తా కథనం
    నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. పార్లమెంటులో అవిశ్వాసంపై మూడో రోజు చర్చ
    అవిశ్వాస తీర్మానంపై నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

    నేడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. పార్లమెంటులో అవిశ్వాసంపై మూడో రోజు చర్చ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 10, 2023
    10:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళ వరుసగా మూడో రోజు చర్చ జరగనుంది. రెండో రోజు బుధవారం చర్చలు వేడెక్కాయి.

    మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆరోపిస్తూ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై గురువారం మోదీ జవాబు ఇవ్వనున్నారు.

    మరోవైపు గురువారమే ఓటింగ్ జరగనుంది. జులై 2018లో మోదీ సర్కారుపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇందులో భాగంగా తీర్మానానికి 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు పోలయ్యాయి.

    ప్రస్తుతం మోదీ సర్కారు రెండో అవిశ్వాసాన్ని ఎదుర్కొంటోంది.మోదీ ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేదని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. తమకు సంపూర్ణ ఆధిక్యం ఉందని పేర్కొంటోంది.

    details

    ప్రధాని సమక్షంలోనే మణిపూర్ అల్లర్లపై చర్చ జరగాలనే అవిశ్వాసం పెట్టాం: విపక్షాలు

    మణిపూర్ అల్లర్ల ఘటనలపై ప్రధాని మోదీ సభలో సమాధానం చెప్పాలని గత కొంత కాలంగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

    ప్రధాని సమక్షంలోనే మణిపూర్‌పై చర్చ జరగాలని, అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టామని వెల్లడించాయి.

    రెండో రోజు చర్చలో భాగంగా మణిపూర్ హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.

    ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మకమైన ఘర్షణలు చెలరేగాయని,ఇవి దురదృష్టకరమైనవని షా చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలని మైతీ, కుకీ ప్రజలకు పార్లమెంట్ నుంచే షా విజ్ఞప్తి చేశారు.

    బలా బలాలు :

    ఎన్డీఏ - 333

    ఇండియా కూటమి - 142

    ఇతరులు - 64

    బుధవారం రాహుల్ గాంధీ 35 నిమిషాల పాటు భారత్ జోడో యాత్ర, మణిపూర్ ఘటనలపై మాట్లాడారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    అవిశ్వాస తీర్మానం

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అరుదైన గౌరవం.. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్​ హానర్ తో సత్కారం ఫ్రాన్స్
    ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష దిల్లీ
    ఫ్రాన్స్ ఎన్ఆర్ఐలకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలోనే ఈఫిల్‌ టవర్ నుంచి యూపీఐ సేవలు  ఫ్రాన్స్
    భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐదేళ్ల వర్క్ వీసాకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్ ఫ్రాన్స్

    అవిశ్వాస తీర్మానం

    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం లోక్‌సభ
    No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?  లోక్‌సభ
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025