NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ
    PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే: ప్రధాని మోదీ

    PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Mar 17, 2024
    06:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు ఒక వరలో ఉండే రెండు కత్తుల లాంటివన్నారు.

    ఆదివారం బొప్పూడిలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ( టీడీపీ-జనసేన-బీజేపీ) ప్రజాగళం బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

    తొలుత 'నా ఆంధ్రా కుటుంబ సభ్యులకు నమస్కారాలు' అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

    కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

    జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 400పైగా సీట్లను సాధిస్తుందన్నారు.

    కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడే.. వికసిత భారత్‌తో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్‌ సైతం సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేసారు.

    మోదీ

    వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి: మోదీ

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చాలా కాలం చేసిన కృషిని గుర్తించాలని మోదీ పిలుపునిచ్చారు.

    ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుందన్నారు.

    ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఆవాస్‌ యోజన కింద దాదాపు పది లక్షల ఇళ్లు ఇచ్చిందన్నారు.

    జలజీవన్‌ మిషన్‌ కింద తమ ప్రభుత్వం కోటి ఇళ్లకు తాగునీరును అందించినట్లు పేర్కొన్నారు.

    ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నారు. రాష్ట్రంలోని మంత్రులు అవినీతిలో పోటీపడుతున్నారు.

    వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఏపీతో పాటు దేశ అభివృద్ధిని కాంక్షించిన వారు ఎన్డీఏకు ఓటేయాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    నరేంద్ర మోదీ

    Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్  మేడారం జాతర
    Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి? దిల్లీ
    PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    Sudarshan Setu: దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలు ఇవే..  గుజరాత్

    ఆంధ్రప్రదేశ్

    Amabti Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ డ్యాన్స్  అంబటి రాంబాబు
    జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్  చంద్రబాబు నాయుడు
    Sankranthi dishes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే  సంక్రాంతి
    PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం  నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు హైదరాబాద్
    China Blast: బీజింగ్ సమీపంలోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు చైనా
    Supreme court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై మార్చి 15న సుప్రీంకోర్టు విచారణ  సుప్రీంకోర్టు
    Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ  బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025