NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Unity Mall: మరో కీలక నిర్మాణానికి వేదిక కానున్న విశాఖ.. యూనిటీ మాల్‌కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Unity Mall: మరో కీలక నిర్మాణానికి వేదిక కానున్న విశాఖ.. యూనిటీ మాల్‌కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన
    మరో కీలక నిర్మాణానికి వేదిక కానున్న విశాఖ.. యూనిటీ మాల్‌కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన

    Unity Mall: మరో కీలక నిర్మాణానికి వేదిక కానున్న విశాఖ.. యూనిటీ మాల్‌కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    08:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా చేనేత,హస్తకళలను ఉత్సాహపరచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిటీ మాల్‌ విశాఖపట్టణంలోని మధురవాడలో నిర్మించనున్నారు.

    ఈ మాల్ నిర్మాణాన్ని జీ+4 అంతస్తులుగా, రూ.172 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.

    ఈ ప్రాజెక్టుకు తొలి దశలో కేంద్ర ప్రభుత్వం రూ.86 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనుల కోసం టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది.

    మే 2న, అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ ద్వారా యూనిటీ మాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం,ఈ మాల్‌ను 2026 మార్చిలోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    వివరాలు 

    ఐదు ఎకరాల్లో వైభవంగా యూనిటీ మాల్ 

    కేంద్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి అవసరమైన మొత్తం రూ.172 కోట్లను 50 ఏళ్లపాటు వడ్డీ లేని రుణంగా రాష్ట్రానికి అందజేస్తోంది.

    మధురవాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 426/2 ప్రాంతంలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మాల్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

    రుషికొండ బీచ్‌కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రతీరాన, కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

    మాల్‌లో జీ+4 అంతస్తులుగా నిర్మాణం ఉంటూ, మొదటి మరియు రెండో అంతస్తుల్లో మొత్తం 62 దుకాణాల ఏర్పాటును ప్రణాళికలోకి తీసుకున్నారు.

    ఇవి 'వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రొడక్ట్' పథకంలో భాగంగా, భౌగోళిక గుర్తింపు కలిగిన దేశవ్యాప్తంగా ఎంపికైన ఉత్పత్తుల అమ్మకాలకు కేటాయించనున్నారు.

    వివరాలు 

    మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా ఏర్పాటు 

    మూడో అంతస్తు సముద్రతీరాన్ని వీక్షించగలిగే సౌకర్యంతో ఉండనుంది.

    నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్‌, రెండు మినీ థియేటర్లు నిర్మించబడతాయి. అదనంగా రిటైల్ స్టోర్లు, ఫుడ్ & బెవరేజ్ ఔట్‌లెట్లు, వినోదానికి సంబంధించిన సదుపాయాలు, ఫిట్‌నెస్ సెంటర్లు, బ్యాంకు శాఖలు, ఫర్నిచర్ స్టోర్లు కూడా ఈ మాల్‌లో ఏర్పాటు చేయనున్నారు.

    ఈ మాల్ ద్వారా వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం అందించిన వడ్డీ లేని రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    విశాఖపట్టణం

    Visakhapatnam: చల్లటి మంచు ఆస్వాదించాలనుకుంటే.. అద్భుతమైన వంజంగి కొండలు చూడాల్సిందే..  పర్యాటకం
    Visakha Metro Rail: విశాఖ 'మెట్రో' మొదటి దశ డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం మెట్రో రైలు
     Vizag: విశాఖ విమానాశ్రయంలో మంచు ప్రభావం.. విమానాల దారి మళ్లింపు విమానం
    Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు నౌకాదళం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025