NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని 
    PM Modi: నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని

    PM Modi: నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2024
    08:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్య, రైల్వే, విమానయానం, రోడ్డు రంగాల్లో రూ.32,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్ములో పర్యటించనున్నట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.

    జమ్ముకశ్మీర్‌లో కొత్తగా రిక్రూట్ అయిన సుమారు 1,500 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేస్తారని, అలాగే 'విక్షిత్ భారత్, విక్షిత్ జమ్ము' ప్రచారంలో భాగంగా వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో సమావేశమవుతారని ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) ఒక ప్రకటన విడుదల చేసింది.

    బనిహాల్-ఖరీ-సంబర్-సంగల్దాన్ ,ఇటీవల విద్యుద్దీకరించబడిన బారాముల్లా-శ్రీనగర్-బనిహాల్-సంగల్దాన్(185.66 కి.మీ)లను కలిపే 48 కిలోమీటర్ల లైన్‌తో సహా పలు రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. జమ్ము లోయలో మొదటి ఎలక్ట్రిక్ రైలును అలాగే సంగల్దాన్,బారాముల్లా స్టేషన్ల మధ్య రైలు సేవలను ప్రారంభిస్తారు.

    Details 

    రూ. 13,375 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం

    బనిహాల్-ఖరీ-సంబర్-సంగల్దాన్ స్ట్రెచ్‌ను ప్రారంభించడం గమనార్హం, ఎందుకంటే ఇది మార్గంలో బ్యాలస్ట్ లెస్ ట్రాక్ (BLT)ని ఉపయోగిస్తుంది, ప్రయాణీకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

    T-50 (12.77 కి.మీ) అనేది ఖరీ,సుంబెర్ మధ్య ఉన్న భారతదేశపు అతి పొడవైన రవాణా సొరంగం. రైల్వే ప్రాజెక్టులు కనెక్టివిటీని పెంచుతాయి, పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి. ప్రాంతం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయి.

    దేశవ్యాప్తంగా విద్య, నైపుణ్యం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,అభివృద్ధి చేయడంలో భారీ ముందడుగు వేస్తూ, దాదాపు రూ. 13,375 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు.

    Details

    విజయపూర్ (సాంబా)లో AIIMS

    ప్రాజెక్ట్‌లలో IIT భిలాయ్,IIT తిరుపతి, IIT జమ్మూ, IIITDM కాంచీపురం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (IIS), కాన్పూర్‌లో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల కోసం మార్గదర్శక నైపుణ్య శిక్షణా సంస్థ ,దేవప్రయాగ్ (ఉత్తరాఖండ్), అగర్తలాలలో (త్రిపుర) కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ క్యాంపస్‌లు ఉన్నాయి.

    జమ్ముకశ్మీర్ ప్రజలకు సమగ్రమైన, నాణ్యమైన ,సంపూర్ణమైన తృతీయ-సంరక్షణ ఆరోగ్య సేవలను అందించడానికి తన ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా, జమ్ములోని విజయపూర్ (సాంబా)లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)ని ప్రధాని ప్రారంభించనున్నారు. జాతీయ ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన' కింద నిర్మిస్తున్న ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ఫిబ్రవరి 2019లో ఆయన శంకుస్థాపన చేశారు.

    Details

    జమ్ము విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి  శంకుస్థాపన 

    రూ.1,660 కోట్ల వ్యయంతో 227 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 720 పడకలు, 125 సీట్లతో మెడికల్ కాలేజీ, 60 సీట్లతో నర్సింగ్ కాలేజీ, 30 పడకలతో ఆయుష్ బ్లాక్, ఫ్యాకల్టీ, సిబ్బందికి నివాస వసతి, హాస్టల్ ఉన్నాయి. UG , PG విద్యార్థులకు వసతి, ఇతర సౌకర్యాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది.

    ఇదిలా ఇలా ఉంటే జమ్ము విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

    ఈ కొత్త టెర్మినల్ 40 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 2000 మంది ప్రయాణికులకు సేవలను అందించవచ్చు.

    Details

    జమ్ముకశ్మీర్‌లో ప్రధాని రెండో సారి పర్యటన 

    అదేకాకుండా ఈ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో జమ్ము - కత్రా మధ్య నిర్మించిన ఢిల్లీ- అమృత్‌సర్- కత్రా ఎక్స్‌ప్రెస్‌వే రెండు ప్యాకేజీలతో పాటు ఇతర ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

    జమ్ములో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

    జమ్ము కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాడిన తర్వాత ప్రధాని రెండో సారి ఇక్కడ పర్యటిస్తున్నారు.

    ప్రధాని పర్యటన నేపథ్యంలో నేటి సాయంత్రం 5 గంటల వరకు క్రాకర్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే డ్రోన్లు ఎగురవేతను సైతం అధికారులు నిషేధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జమ్ముకశ్మీర్

    ఐదో రోజూ కొనసాగుతున్న అనంతనాగ్‌ ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భారత సైన్యం ఆర్మీ
    జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం ఎన్‌కౌంటర్
    'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్ భారతదేశం
    రెండు ఉగ్రదాడులను చేధించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. ఐదుగురు లష్కర్ టెర్రరిస్టుల అరెస్ట్  ఉగ్రవాదులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025