NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
    Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Oct 18, 2023
    12:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రైలు సర్వీస్ రాపిడ్‌ఎక్స్‌ను శుక్రవారం (అక్టోబర్ 20) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

    దిల్లీ-ఘజియాబాద్-మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్‌టీఎస్) మొదటి విడతగా దుహై నుంచి సాహిబాబాద్ మధ్య 17కిలోమీటర్ల వరకు ప్రారంభించనున్నారు.

    దిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఫేజ్ 1లో ప్రణాళిక చేయచేసిన మూడు ప్రాధాన్య కారిడార్లలో ఇది మొదటిది.

    దిల్లీ-మీరట్ కారిడార్ మొత్తం పొడవు 82 కిలోమీటర్లు ఉంటుంది. ఒక గంటలో ఈ మొత్తం గమ్యాన్ని చేరుకోవచ్చు. మొదటి దశలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపోలను ఈ రైలు కవర్ చేస్తుంది.

    ఎంఎంటీఎస్ తరహాలో దిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య ప్రయాణం కోసం అధునాతన ఆర్ఆర్‌టీఎస్ రైళ్లను తీసుకొస్తున్నారు.

    దిల్లీ

    రూ. 30,274 కోట్లతో ప్రాజెక్టు 

    ఈ మొత్తం ప్రాజెక్టును రూ. 30,274 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నుంచి నిధులు కూడా అందాయి.

    ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ద్వారా భారత ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సర్కార్లు జాయింట్ వెంచర్‌గా చేపడుతున్నాయి.

    రాపిడ్‌ఎక్స్‌ రైలు మెట్రో రైళ్లను పోలి ఉంటుంది. అయితే రైలు ఫీచర్లు మాత్రం మెట్రో మాదిరిగా ఉండవని, పూర్తిగా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ఎన్‌సీఆర్టీసీ పేర్కొంది.

    దిల్లీ

    ఈ రైళ్లలో అధునాత ఫీచర్లు 

    రాపిడ్‌ఎక్స్‌ రైళ్లలో విశాలమైన సీట్లు, ఎక్కువ లెగ్‌రూమ్, కోట్ హ్యాంగర్‌లతో కూడిన ప్రీమియం-క్లాస్ కార్లు ఉంటాయి.

    రైళ్లలో లగేజీ క్యారియర్లు, మినీ స్క్రీన్‌లు, వై-ఫై, మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సౌకర్యం వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

    ఈ రైళ్లు 180km/h వేగంతో నడుస్తాయి. ఇది భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థగా మారనుంది.

    ఒక్కో రైలులో 407 సీట్లు ఉంటాయి. ఈ రైళ్లు కేవలం ఒక గంటలో 100 కిలోమీటర్లు ప్రయాణించగలవు. అయితే మెట్రో రైలుకు 100 కిలోమీటర్లు మూడు గంటల సమయం పడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
    RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు! ఆర్ బి ఐ
    EPFO: ELI పథకం కోసం ఈపీఎఫ్‌వో UAN యాక్టివేషన్‌ గడువు పెంపు ఈపీఎఫ్ఓ

    దిల్లీ

    G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన  నరేంద్ర మోదీ
    దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు  రిషి సునక్
    రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు  జీ20 సదస్సు
    G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ  జీ20 సమావేశం

    నరేంద్ర మోదీ

    PM Modi: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    PM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన  ప్రధాని మోదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ బీజేపీ
    ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    ప్రధాన మంత్రి

    Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు స్వాతంత్య్ర దినోత్సవం
    Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ  స్వాతంత్య్ర దినోత్సవం
    ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో 6G.. సూపర్ స్పీడ్ సాంకేతికతపై టాస్క్‌ఫోర్స్‌ దిల్లీ
    అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ ఇజ్రాయెల్
    సిక్కిం, బెంగాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను గుట్టు రట్టు.. 50 ప్రాంతాల్లో దాడులు సీబీఐ
    ఇజ్రాయెల్ దాడిలో 'హమాస్' వైమానిక దళాల చీఫ్ హతం  ఇజ్రాయెల్
    IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025