NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Toxic gases leak: జైపూర్‌ కోచింగ్‌ సెంటర్‌లో విష వాయువుల కలకలం.. స్పృహతప్పిన విద్యార్థులు
    తదుపరి వార్తా కథనం
    Toxic gases leak: జైపూర్‌ కోచింగ్‌ సెంటర్‌లో విష వాయువుల కలకలం.. స్పృహతప్పిన విద్యార్థులు
    జైపూర్‌ కోచింగ్‌ సెంటర్‌లో విష వాయువుల కలకలం.. స్పృహతప్పిన విద్యార్థులు

    Toxic gases leak: జైపూర్‌ కోచింగ్‌ సెంటర్‌లో విష వాయువుల కలకలం.. స్పృహతప్పిన విద్యార్థులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 16, 2024
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఉన్న ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్‌లో విష వాయువుల కలకలం చోటుచేసుకుంది.

    ఆదివారం రాత్రి గోపాల్‌పూర్‌లోని ఈ కోచింగ్ సెంటర్‌లో హఠాత్తుగా పొగలు వ్యాపించడంతో విద్యార్థులలో ఆందోళన మొదలైంది.

    అప్పుడు సెంటర్‌లో సుమారు 350 మంది విద్యార్థులున్నారు. ఆ పొగల కారణంగా ఊపిరాడక 12 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు.

    అందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండటంతో వారిని ఐసీయూలో చేర్పించారు. పొగలు ఎక్కడి నుంచి వ్యాపించాయనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

    ప్రాథమిక విచారణలో, పొగలు కోచింగ్ సెంటర్‌ పక్కనే ఉన్న ఇంటి వంటగది నుంచి గ్యాస్ లీక్‌ కావడం వల్లా లేదా సమీపంలోని డ్రైనేజీ నుంచి విష వాయువులు బయటకు రావడంతో జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Details

    చర్యలు చేపట్టిన అధికారులు

    సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.

    విద్యార్థుల భద్రత దృష్ట్యా ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్‌ను వెంటనే సీల్ చేశారు. అలాగే సమీపంలోని పేయింగ్ గెస్ట్ భవనాన్ని కూడా సీజ్ చేశారు.

    విచారణ పూర్తయ్యే వరకు ఈ భవనాలను మూసివేయాలని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు.

    ఈ ఘటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు ఆరోపిస్తున్నారు.

    ఈ ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జైపూర్
    రాజస్థాన్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    జైపూర్

    భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP ఆటో మొబైల్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు! తెలంగాణ

    రాజస్థాన్

    Rajasthan: విద్యార్థి దారుణ హత్య.. రాడ్లతో, గొలుసుతో కొట్టి! ఇండియా
    Rajasthan CM Oath Ceremony: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ  భారతదేశం
    Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ  కాంగ్రెస్
    Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌.. సచిన్‌కు కీలక బాధ్యతలు  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025