NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / J&K: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    J&K: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం
    జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం

    J&K: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2024
    08:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది.

    శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతోంది.

    ఇవి పీర్ పంజాల్ పర్వత శ్రేణి రెండువైపులా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా,బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా,ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

    ఒమర్ అబ్దుల్లా గండేర్‌బల్, బడ్‌గామ్ స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. హమీద్ కర్రా సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గం నుండి, రవీందర్ రైనా నౌషేరా స్థానం నుండి పోటీ పడుతున్నారు.

    వివరాలు 

    అక్టోబర్‌ 8న  ఫలితాలు 

    ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. 3,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది, వీటిలో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

    ఈ నెల 18న జరిగిన తొలి దశ పోలింగ్‌లో 61.38 శాతం ఓటింగ్‌ నమోదైంది. మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్ అక్టోబర్‌ 1న జరగనుంది. ఫలితాలు అక్టోబర్‌ 8న వెలువడనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఎన్నికలు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    జమ్ముకశ్మీర్

    JammuKashmir: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఒక పోలీస్ అధికారికి గాయాలు ఎన్‌కౌంటర్
    PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Jammu and Kashmir: యూరీలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఆయుధాలు స్వాధీనం  ఎన్‌కౌంటర్
    Ladakh: లడఖ్‌లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు వీరమరణం భారతదేశం

    ఎన్నికలు

    బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ  చంద్రబాబు నాయుడు
    Lok Sabha Elections Date: నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల  ఎన్నికల సంఘం
    General Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్  లోక్‌సభ
    Model Code Of Conduct: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఇది ఎవరికి వస్తుంది!  ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025