Ponzi Scam: ₹ 100-కోట్ల పోంజీ స్కామ్లో నటుడు ప్రకాష్ రాజ్కు సమన్లు
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)₹ 100కోట్ల పోంజీ స్కీమ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని సమన్లు పంపింది. స్కామ్ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణవ్ జ్యువెలర్స్కు ప్రకాష్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. పోంజీ స్కీమ్ను అమలు చేసి ₹ 100 కోట్ల పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలతో చెన్నై, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో శాఖలను కలిగి ఉన్న తిరుచ్చికి చెందిన ఆభరణాల సంస్థ శాఖలపై ED దాడులు చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్ నిర్వహిస్తున్న దుకాణాలను అక్టోబర్లో మూసేశారు. అందిన ఫిర్యాదుల ఆధారంగా,తిరుచ్చిలోని ఆర్థిక నేరాల విభాగం యజమాని మధన్పై కేసు నమోదు చేసింది. ఈనెల ప్రారంభంలో యజమాని,అతని భార్యపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.