NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజుల రిమాండ్‌.. 
    తదుపరి వార్తా కథనం
    Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజుల రిమాండ్‌.. 
    పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజుల రిమాండ్‌..

    Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజుల రిమాండ్‌.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 28, 2025
    08:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కులాలు, సినీ అభిమానులు,రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు,వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో నమోదైన కేసులో వైఎస్సార్సీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

    గురువారం రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5:00 గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.

    పోసాని తరఫున అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

    బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం,పోసానికి 41ఏ నోటీసులు జారీ చేసి బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

    అయితే, మెజిస్ట్రేట్ ఈ అభ్యర్థనను తిరస్కరించి, 14రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    వివరాలు 

    జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు 

    దీంతో పోసాని కృష్ణమురళి మార్చి 12 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. ఆయనను కడప కేంద్రకారాగారానికి తరలించే అవకాశం ఉంది.

    ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి ఫిబ్రవరి 24న పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    దీనిపై స్పందించిన పోలీసులు, పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు, అనంతరం పోసానిని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్
    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్

    ఆంధ్రప్రదేశ్

    AP Houses: ఇళ్లు, స్థలాలు రద్దు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Andhra News: వేసవిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్‌ విధానం భారతదేశం
    E - office: నెలాఖరుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థ  భారతదేశం
    APPSC: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ విధానం, పరీక్షా వివరాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025