NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: పహల్గాం దాడిపై ప్రధానమంత్రి మోదీ ఫైర్‌.. ఉగ్రవాదులకు ఘాటు హెచ్చరిక
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: పహల్గాం దాడిపై ప్రధానమంత్రి మోదీ ఫైర్‌.. ఉగ్రవాదులకు ఘాటు హెచ్చరిక
    పహల్గాం దాడిపై ప్రధానమంత్రి మోదీ ఫైర్‌.. ఉగ్రవాదులకు ఘాటు హెచ్చరిక

    PM Modi: పహల్గాం దాడిపై ప్రధానమంత్రి మోదీ ఫైర్‌.. ఉగ్రవాదులకు ఘాటు హెచ్చరిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకెక్కాయి.

    పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF)' ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి, 26 మంది పౌరులను నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపారు.

    ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదులపై తీవ్రంగా స్పందిస్తూ, వారి వెనుక ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    తాజాగా భారత్‌-పాక్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, మోదీ మరోసారి ఉగ్రవాదులకు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.

    అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ గొన్‌కాల్వ్స్ లౌరెంకోతో కలసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.

    Details

    కఠిన చర్యలు తీసుకుంటాం

    ఉగ్రవాదం అనేది మానవాళికి అతిపెద్ద ముప్పు. ఉగ్రవాదులు వారికి సహకరించే వారిపై భారత్ కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంపై బలమైన నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

    పహల్గామ్ ఘటన వెనుక పాక్ పాత్ర ఉన్నట్టు దేశ దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాక్‌కి చెందినవారని, వారిలో ఒకరు పాకిస్తాన్ ఆర్మీలో పారా కమాండోగా పని చేసినవాడని సమాచారం.

    దీంతో ఈ దాడికి పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే తోయిబా మధ్య పక్కా తోడ్పాటుందన్న అభిప్రాయం ఏర్పడింది.

    Details

    ఎక్కడున్నా వదిలిపెట్టం

    ఏప్రిల్ 22న ఈ దాడి జరిగిన తరువాత, వెంటనే భద్రతాపరమైన అంశాలపై ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ సమావేశమైంది.

    తదుపరి రోజు బీహార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... ''ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వారిని ఎక్కడ ఉన్నా వెంబడించి శిక్షిస్తాం. వారి మద్దతుదారులకూ ఏ మాత్రం మినహాయింపు ఉండదు.

    భూమి చివరదాకా వెంబడి శిక్షిస్తామని ఉగ్రవాదులపై తీవ్రంగా స్పందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఉగ్రవాదులు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    Prime Minister Modi: ఆదివాసీల సంప్రదాయ ఆహారం ఇప్పపువ్వు లడ్డూ.. మన్‌కీబాత్‌లో నరేంద్ర మోదీ ప్రశంస  మన్ కీ బాత్
    PM Modi: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు.. ఆనందం, విజయం కలగాలని ప్రధాని ట్వీట్ యోగి ఆదిత్యనాథ్
    Nidhi Tewari :ప్రధానమంత్రి మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకం.. ఆమె ఎవరంటే..! భారతదేశం
    Modi-Stalin:డీలిమిటేషన్‌పై ఆందోళన..ప్రధాని మోదీతో అత్యవసర భేటీకి సమయం కోరిన స్టాలిన్ ఎం.కె. స్టాలిన్

    ఉగ్రవాదులు

    26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత  పాకిస్థాన్
    Delhi : ఆ ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులే.. బైక్ దొంగల వెనుక భారీ ఉగ్ర నెట్‌వర్క్  దిల్లీ
    ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్
    India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు  ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025