Page Loader
PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ప్రదానం
ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ప్రదానం

PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ప్రదానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం లభించింది. ఇప్పటికే అనేక దేశాల నుంచి అరుదైన అవార్డులను అందుకున్న ఆయనకు తాజాగా శ్రీలంక మిత్ర విభూషణ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా శ్రీలంకలో పర్యటనలో ఉన్న మోదీకి ఈ గౌరవం అందించడంతో, విదేశాల్లో ఆయనకు లభించిన ఇది 22వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం. భారత్-శ్రీలంక మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రతిబింబించే ప్రతీకగా ఈ అవార్డును చూడవచ్చు.

Details

మిత్ర విభూషణ అవార్డులోని ప్రత్యేక చిహ్నాల అర్థం 

ధర్మ చక్రం : రెండు దేశాల మధ్య బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది. పుణ కలశం: కొత్త ప్రారంభాలు, శుభత, ఐశ్వర్యానికి సంకేతం. నవరత్నాలు: భారత్-శ్రీలంకల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక స్నేహాన్ని సూచిస్తూ, పద్మదళాల చుట్టూ లోకగోళ రూపంలో ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు : ఈ రెండు దేశాల స్నేహం శాశ్వతంగా కొనసాగుతుందనే భావనను సూచించాయి.