NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ
    హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం

    అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Apr 08, 2023
    01:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదని మండిపడ్డారు.

    రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండకూడదన్నారు.

    తొలుత ప్రధాని మోదీ 'ప్రియమైన సోదర, సోదరీమణులారా, మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారములు' అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.

    భాగ్యలక్ష్మి నగరాన్ని, వేంకటేశ్వర స్వామి దేవస్థానం నగరాన్ని ఈ వందేభారత్ ఎక్స్ ప్రెక్స్ రైలు ద్వారా కలిపినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

    ప్రధాని మోదీ

    తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చేందుకు ఎన్డీయే కట్టుబడి ఉంది: మోదీ

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చేందుకు కేంద్రంలోని ఎన్డీయే కట్టుబడి ఉందన్నారు.

    రైల్వే లైన్లు, కొత్త సేవలు, జాతీయ రహదారి ప్రాజెక్టులను రెట్టింపు చేయడం వంటి రైలు, ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం మద్దతు ఇస్తోందన్నారు.

    కొత్తగా ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టులు కనెక్టివిటీని సృష్టిస్తాయన్నారు. ప్రజలకు జీవనోపాధిని సృష్టించడానికి, పర్యాటకం ఆర్థిక కార్యకలాపాలకు దోహదంగా నిలుస్తాయని మోదీ స్పష్టం చేశారు.

    ప్రధాని మోదీ

    కేసీఆర్ కుటుంబంపై మోదీ పరోక్ష విమర్శలు

    కొద్దిమంది అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై మోదీ పరోక్ష విమర్శలు చేశారు. వారికి దేశాభివృద్ధి కంటే వారి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు.

    కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ నిధులు తమ చేతుల్లోకి రావాలని రాష్ట్రం ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

    అవినీతిని రూపుమాపేందుకు కేంద్రం పోరాడుతోందని మోదీ స్పష్టం చేశారు.

    అవినీతికి వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న పోరాటానికి ఉపశమనం, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    హైదరాబాద్
    తెలంగాణ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నరేంద్ర మోదీ

    మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మేఘాలయ
    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు ప్రమాణ స్వీకారం
    ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    మేఘాలయ: నరేంద్ర మోదీ సమాధిపై కాంగ్రెస్ కామెంట్స్; అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ప్రధాని నాగాలాండ్
    Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు నరేంద్ర మోదీ

    హైదరాబాద్

    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం మహీంద్రా
    తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం ఎన్నికల సంఘం
    నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్ నందమూరి బాలకృష్ణ
    ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్ టాటా

    తెలంగాణ

    మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి కల్వకుంట్ల కవిత
    టీఎస్‌పీఎస్‌సీ: మొత్తం 5 పేపర్లు లీకైనట్లు గుర్తించిన సిట్! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025