NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ
    తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ

    తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Oct 01, 2023
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహబూబ్‍‌నగర్‌లో ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.

    రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించిన తర్వాత మోదీ ప్రజాగర్జన వేదిక వద్దకు వచ్చి మాట్లాడారు.

    తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు మోదీ పేర్కొన్నారు.

    తెలంగాణ అవినీతి రహిత పాలన కావాలన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో బీజేపీని ప్రజలు బలోపేతం చేసినట్లు మోదీ వివరించారు.

    తెలంగాణకు కావాల్సింది అస్యత్యాలు చెప్పేవాళ్లు కాదని, క్షేత్రస్థాయిలో పనులు చేసేవాళ్లు కావాలని మోదీ స్పష్టం చేశారు.

    రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

    మోదీ

    రైతు పథకాల పేరుతో తెలంగాణ సర్కార్ దోచుకుంటోంది: మోదీ 

    తెలంగాణకు గత 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చామని మోదీ ప్రకటించారు. వాస్తవానికి తెలంగాణలో తమ సర్కార్ లేకపోయినా.. ఈ రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

    కేసీఆర్ ప్రభుత్వం రైతు పథకాల పేరుతో ప్రజలను దోచుకుంటోందన్నారు. సాగునీటి కాలువల పేరుతో గొప్పలకు పోతోందని దుయ్యబట్టారు.

    ఒకరకంగా చెప్పాలంటే, ఇక్కడి ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందన్నారు. తమ ప్రభుత్వం రైతును ప్రత్యేకంగా గౌరవిస్తుదని మోదీ అన్నారు.

    రైతుల కష్టానికి తాము తగిన ప్రతిఫలం అందిస్తున్నట్లు చెప్పారు. కేవలం రైతుల కోసం తమ ప్రభుత్వం రామగుండ ఫెర్టిలైజర్‌ ఫ్యాక్టరీని తెరిపించినట్లు స్పష్టం చేశారు.

    రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు మోదీ ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

    మోదీ

    బీఆర్ఎస్ సర్కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో: మోదీ 

    ఎంఐఎం పార్టీపై కూడా ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

    బీఆర్ఎస్ సర్కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని మోదీ ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు అవినీతి, కమీషన్లతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాయని స్పష్టం చేశారు.

    బీఆర్ఎస్- మజ్లీస్ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు మారి ప్రభుత్వాన్ని నడుపున్నట్లు చెప్పారు.

    రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు నిద్రపట్టదని మోదీ చెప్పుకొచ్చారు.

    రాష్ట్రంలో 2014కు ముందు కేవలం 2500 కి.మీ జాతీయ రహదారులు మాత్రమే ఉండేవన్నారు.

    తమ ప్రభుత్వం కేవలం తొమ్మిదేళ్ల పాలనలో 2500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించామని మోదీ అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బీజేపీ ట్వీట్

    India is the largest producer, consumer and exporter of turmeric... For a golden spice like turmeric, there was no board.

    The BJP govt has decided to form the National Turmeric Board. It will hugely benefit the farmers of Telangana.

    - PM @narendramodi pic.twitter.com/m92GmJtUVA

    — BJP (@BJP4India) October 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నరేంద్ర మోదీ

    G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన  దిల్లీ
    Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం మొరాకో
    రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు  దిల్లీ
    G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ  జీ20 సమావేశం

    ప్రధాన మంత్రి

    కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ రాజస్థాన్
    యూసీసీపై గడువు పెంచేది లేదు.. తేల్చేసిన లా కమిషన్ ఇండియా
    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  నరేంద్ర మోదీ
    ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్  అవిశ్వాస తీర్మానం

    తెలంగాణ

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు  ప్రభుత్వం
    డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు  హైదరాబాద్
    తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ 5 వరాలు..10 లక్షల మందితో సోనియా గాంధీ భారీ సభ కాంగ్రెస్
    TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు  టీఎస్ఆర్టీసీ

    తాజా వార్తలు

    దిల్లీలో బెంగాల్ వ్యాపారి కిడ్నాప్.. ముగ్గురు అరెస్ట్ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 రద్దుపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు టీఎస్పీఎస్సీ
    కేంద్రం వద్ద 70కొలీజియం సిఫార్సులు పెండింగ్.. సుప్రీంకోర్టు అసహనం  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025