NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ
    తదుపరి వార్తా కథనం
    సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ

    సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 14, 2023
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌ బినాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్ష ఇండియా కూటమి 'సనాతన ధర్మాన్ని' నాశనం చేయాలనుకుంటోందన్నారు.

    సనాతన ధర్మంపై డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలఅనంతరం మొట్టమొదటి సారి ప్రధాని ఈ విషయమై స్పందించారు.

    మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని రూ. 50,700 కోట్లకు పైగా విలువైన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా రాష్ట్రంలో మరో పది కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

    ఇటీవల ముంబైలో సమావేశం నిర్వహించిన,'ఘమాండీ' కూటమికి సరైన నాయకుడు లేడని .. వారు భారతదేశ సంస్కృతిపై దాడి చేయడానికి రహస్య అజెండాను నిర్ణయించుకున్నట్లు ఆరోపించారు.

    Details 

    జీ20 సదస్సు 140 కోట్ల మంది ప్రజల విజయం: మోదీ 

    సనాతన సంస్కృతిని నాశనం చేయాలనే తీర్మానంతో ఇండియా కూటమి ఉందన్నారు. ఈ అజెండాపై దేశాన్ని ప్రేమించే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

    దిల్లీ వేదికగా జీ20 సదస్సును భారత్‌ ఎలా విజయవంతంగా నిర్వహించిందో ప్రజలంతా చూశారని.. ఈ ఘనత దేశ ప్రజలకు దక్కుతుందని.. ఇది 140 కోట్ల మంది ప్రజల విజయమని మోదీ అన్నారు.

    ఈ నెల ప్రారంభంలో, డీఎంకే నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు. దానిపై భగ్గుమన్న అధికార బీజేపీ విపక్ష ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జీ20 సదస్సు 140 కోట్ల మంది ప్రజల విజయం: మోదీ 

    #WATCH | Bina, Madhya Pradesh: Prime Minister Narendra Modi says "You all have seen how India has successfully organised the G20 Summit. The credit for the success of the G20 Summit goes to the people of the country. It is the success of 140 crore people" pic.twitter.com/UYCV78kodC

    — ANI (@ANI) September 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    సనాతన ధర్మం

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    నరేంద్ర మోదీ

    BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి  బ్రిక్స్ సమ్మిట్
    Rakhi Thali for Modi: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి 'రాఖీ' థాలీని సిద్ధం చేసిన ప్రవాసులు  బ్రిక్స్ సమ్మిట్
    భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ కీలక వ్యాఖ్యలు..5 ట్రిలియన్‌ డాలర్లుగా ఎదుగుతుందని జోస్యం బ్రిక్స్ సమ్మిట్
    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి మిజోరం

    సనాతన ధర్మం

    Sanatana Dharma Day: సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించిన అమెరికా నగరం  తాజా వార్తలు
    Sanatan Dharma row:ఉదయనిధి స్టాలిన్‌పై 'జెనోసైడ్' అంటూ ట్వీట్.. అమిత్ మాల్వియాపై ఎఫ్‌ఐఆర్ బీజేపీ
    'సనాతన' వ్యాఖ్యలపై స్టాలిన్ కుమారుడిని కొట్టడానికి రూ.10 లక్షలు: హిందూ సంస్థ పోస్టర్ ఆంధ్రప్రదేశ్
    'అవినీతి నుండి దృష్టి మరల్చడానికే నా వ్యాఖ్యలను ఆయుధంగా మార్చుకున్నారు': సనాతన వివాదంపై ఉదయనిధి స్టాలిన్   ఉదయనిధి స్టాలిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025