NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం
    తదుపరి వార్తా కథనం
    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం
    దిల్లీలో వెలిసిన ఖలిస్తానీ అనుకూల పోస్టర్లు

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం

    వ్రాసిన వారు Stalin
    Jan 20, 2023
    12:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు కలకలం సృష్టించాయి. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో దిల్లీలో పలు ప్రాంతాల్లో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి.

    'సిక్కుస్ ఫర్ జస్టిస్', 'ఖలిస్తానీ జిందాబాద్', 'రెఫరెండం -2020' అని రాసి ఉన్న పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు గోడలకు అంటించారు.

    సిక్కుల కోసం ప్రత్యేక దేశం కావాలని ఖలిస్తానీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. వారు మిలిటెంట్ ఉద్యమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఉద్యమాలను అణచివేశాయి. రెండు నెలల క్రితం హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఖలిస్థాన్ జెండాలు వెలిశాయి.

    దిల్లీ

    ఖలిస్తానీ పోస్టర్ల కలకలంపై కేసులు నమోదు చేసిన దిల్లీ పోలీసులు

    రిపబ్లిక్ డే వేడుకలు ఇంకో ఐదు రోజుల్లో జరగనుండటంతో దిల్లీ పోలీసులతో పాటు కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. పోస్టర్లు ప్రత్యక్ష కావడంపై పోలీసులు కూడా కేసులు కూడా నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల ఉగ్రవాద నిరోధక విభాగం విచారణ ప్రారంభించింది.

    మరోవైపు కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ కోసం కంటెంజెంట్లు రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నందున ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు కర్తవ్యపథ్ చుట్టూ ఉన్న భవనాల్లో విధ్వంస నిరోధక తనిఖీలు (ఏఎస్‌సీ) నిర్వహిస్తున్నారు.

    జనవరి 23న పూర్తి డ్రస్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. దీని కోసం జనవరి 22 సాయంత్రం 6.30 నుంచి జనవరి 23 మధ్యాహ్నం 1 గంటల వరకు కర్తవ్యపథ్ చుట్టూ ఉన్న భవనాలను మూసివేస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Sonam Raghuvanshi Case: 'నేనే నా భర్తను చంపించాను..': మేఘాలయ పోలీసుల ముందు ఒప్పుకున్న సోనమ్.. మేఘాలయ
    Covid-19: దేశంలో కరోనా కలకలం.. భారీగా పెరిగిన కరోనా కేసులు..  కరోనా కొత్త కేసులు
    Tata Electric Cars: టాటా EVలపై భారీ తగ్గింపు: రూ.1 లక్ష వరకు డిస్కౌంట్! టాటా మోటార్స్
    Bengaluru stampede: విక్టరీ పరేడ్‌పై ఆర్బీబీ చేసిన ప్రచారం వల్లే తొక్కిసలాట.. కర్ణాటక ప్రభుత్వం  కర్ణాటక

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? టాటా
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025