NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు
    పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు

    Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 29, 2025
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నిర్వహిస్తున్న వార్షిక మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.

    పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఈ మహానాడును పండగలా జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఈ మహాసభలకు సంబంధించిన రెండు రోజుల కార్యాచరణ విజయవంతంగా ముగిసింది.

    ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్విరామంగా జరిగిన సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు సాగాయి.

    పసుపు పండుగగా భావిస్తున్న ఈ మహానాడులో రెండో రోజు ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. ఇక తుది రోజు అయిన గురువారం, మహానాడుకు విశిష్ట స్థానం దక్కనుంది.

    Details

    మధ్యాహ్నం భారీ బహిరంగ సభ

    మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

    ఈ సభలో పార్టీ అధినేత సహా ముఖ్య నాయకులు ప్రసంగించనున్నారు. ఏక సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు.

    ఈ సభను రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు వీక్షించనున్నారు.

    గురువారంనాటి బహిరంగ సభలో పాల్గొననున్న లక్ష మందికి భోజన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    అంతేగాక, కడపకు వచ్చే మార్గాల్లో ప్రయాణించే మరో రెండు లక్షల మందికి కూడా భోజన సదుపాయాలు కల్పించారు.

    Details

    ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు

    అన్ని రకాల వసతులతో సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ట్రాఫిక్‌ సమస్యలొచ్చకుండా పోలీసులు, అధికారులు సమర్థవంతంగా చర్యలు తీసుకున్నారు.

    రెండో రోజుతో పోలిస్తే మరింత అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కడపకు చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి కార్యకర్తల రాక ఇప్పటికే ప్రారంభమైంది.

    కడప నగరం మొత్తం గత నాలుగు నుంచి ఐదు రోజులుగా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో ఉత్సాహవంతంగా మారింది.

    పట్టణం అంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మొత్తంగా చూస్తే, టీడీపీ మహానాడు తుదిదశకు చేరుకుంటున్న ఈ వేళ, గురువారంనాటి బహిరంగ సభలో పార్టీ భావితరాలకు దిశానిర్దేశం చేసే కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కడప

    తాజా

    Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు కడప
    Child Trafficking: సూర్యాపేటలో దారుణం.. దత్తత పేరుతో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్  సూర్యాపేట
    IPL 2025: అయ్యర్‌ vs కోహ్లీ.. తొలి ఫైనల్ బెర్తు ఎవరిదో? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Ap news: 10 భారీ పారిశ్రామిక పార్కులు.. ఈఓఐ జారీ చేసిన ఏపీఐఐసీ ఆంధ్రప్రదేశ్

    కడప

    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి
    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ పులివెందుల
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025