NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lalu Prasad Yadav: కిడ్నాపర్లతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధాలు.. రబ్రీ దేవి సోదరుడు సంచలన ఆరోపణలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Lalu Prasad Yadav: కిడ్నాపర్లతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధాలు.. రబ్రీ దేవి సోదరుడు సంచలన ఆరోపణలు 
    కిడ్నాపర్లతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధాలు

    Lalu Prasad Yadav: కిడ్నాపర్లతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధాలు.. రబ్రీ దేవి సోదరుడు సంచలన ఆరోపణలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 14, 2025
    11:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాజీ రాజ్యసభ సభ్యుడు, లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది సుభాష్ యాదవ్ గురువారం సంచలన ఆరోపణలు చేశారు.

    బీహార్‌ను పాలిస్తున్న కాలంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కిడ్నాప్‌లకు పాల్పడే ముఠాలతో సంబంధాలు కొనసాగించారని ఆరోపించారు.

    లాలూ భార్య రబ్రీదేవీకి సుభాష్ యాదవ్ సహోదరుడు కావడం గమనార్హం.

    సుభాష్ యాదవ్ మాట్లాడుతూ, ''కిడ్నాప్‌ల వెనుక నా హస్తం ఉందని వారు చెబుతున్నారు. కానీ, నిజానికి ప్రజలను కిడ్నాప్ చేసి విడుదల చేయాల్సిందిగా ఆదేశించేది లాలూనే. ఆయన అధికార దుర్వినియోగంతో ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు'' అని ఆరోపించారు.

    తనపై నేర ఆరోపణలకు ఆధారాలుంటే, లాలూ ప్రసాద్‌ మాదిరిగానే తానూ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.

    వివరాలు 

    సాధు యాదవ్ కౌంటర్ 

    ఈ ఆరోపణలపై రబ్రీదేవీ మరో సోదరుడు సాధు యాదవ్ స్పందిస్తూ, ''సుభాష్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. ఇతర రాజకీయ పార్టీల మద్దతుతో ఇలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది'' అని అన్నారు.

    ఇంకా ''సుభాష్ అనేక అనుమానాస్పద కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. నిజానికి, కిడ్నాప్ ముఠాలతో అతనికే సంబంధాలు ఉన్నాయని అనిపిస్తోంది'' అని ఆరోపించారు.

    వివరాలు 

    లాలూ కుటుంబంపై తరచూ ఆరోపణలు 

    సాధు, సుభాష్ యాదవ్‌లపై ఎన్డీయే కూటమి తరచుగా ఆరోపణలు చేస్తూ వచ్చింది.

    గతంలో లాలూ కుమార్తె మీసా భారతి వివాహ వేడుక కోసం పాట్నాలోని కార్ షోరూం నుంచి వాహనాలను బలవంతంగా తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

    1999లో వాహనాలను దోచుకున్న విషయాన్ని సుభాష్ యాదవ్ అంగీకరించారు.

    ''ఆ సమయంలో లాలూ సూచన మేరకే ఆ దోపిడీ జరిగింది. నేను అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఆయన అధికార మత్తులో ఎవరూ చెప్పినది వినే స్థితిలో లేడు'' అని అన్నారు.

    వివరాలు 

    తేజస్వీ యాదవ్‌పై వ్యాఖ్యలు 

    తన మేనల్లుడు తేజస్వీ యాదవ్ గురించి మాట్లాడుతూ, ''ఆయన సీజనల్ రాజకీయ నాయకుడు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విశేష విజయాన్ని సాధిస్తుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో 200కు పైగా సీట్లు గెలుస్తాం'' అని జోస్యం చెప్పారు.

    ఈ ఆరోపణలపై ఆర్జేడీ ప్రతినిధి శక్తి యాదవ్ స్పందిస్తూ, ''మా నేతలపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించినా, అది బీహార్‌పై ఎలాంటి ప్రభావం చూపదు'' అని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లాలూ ప్రసాద్ యాదవ్

    తాజా

    Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు! జీవనశైలి
    Tata Harrier EV: హారియర్ EV అడ్వెంచర్‌ ఫీచర్లలో బెస్ట్.. రూ.21.49 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ!  టాటా మోటార్స్
    Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం! రాజస్థాన్
    Vijay: విజయ్ రాజకీయ యాత్రకు శ్రీకారం.. రెండో వారంలో ప్రజల్లోకి! విజయ్

    లాలూ ప్రసాద్ యాదవ్

    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సీబీఐ
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం సీబీఐ
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025