Loading...
Rahul Gandhi: ఎన్నికల సంస్కరణలపై మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్‌గాంధీ 
ఎన్నికల సంస్కరణలపై మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్‌గాంధీ

Rahul Gandhi: ఎన్నికల సంస్కరణలపై మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్‌గాంధీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల సంస్కరణల అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను రక్షించేందుకు చట్టాలనే మార్చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే తప్పు చేసినా శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం ఈసీకి కల్పించారని పేర్కొన్నారు. ఓట్ల చోరీకు సంబంధించిన అనేక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మూడు కీలక ప్రశ్నలు లేవనెత్తారు.

వివరాలు 

ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి రోజురోజుకీ ఎందుకు బలహీనపడుతోంది?: రాహుల్  

ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి రోజురోజుకీ ఎందుకు బలహీనపడుతోందని ప్రశ్నించారు.

దాని స్వతంత్రతను కాపాడే యంత్రాంగాన్ని ప్రభుత్వం తిరిగి బలోపేతం చేయబోతుందా? అని సందేహం వ్యక్తం చేశారు.

సార్‌ ప్రక్రియపై అనేక రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వస్తున్న వేళ, ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న మార్పులు, అవకతవకల్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టుతోందని అడిగారు.

అలాగే ఈసీ నియామకాలు, కీలక నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా జరుగుతున్నట్లుగా ఎందుకు కనిపిస్తున్నాయని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో పారదర్శక సంస్కరణలు అమలు చేయడానికి ప్రభుత్వం నిజంగా కట్టుబడి ఉందా? అంటూ నిలదీశారు.

వివరాలు 

హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ పేరుతో 23 ఓట్లు 

భాజపాకు అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

పోలింగ్ ముగిసిన 45 రోజుల తర్వాత సీసీ ఫుటేజీని ధ్వంసం చేయాలన్న నిబంధన తీసుకురావడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.

ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలన్నిటిని ప్రజల ముందుంచినా, ఇప్పటివరకు తనకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నారు.

హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ పేరుతో 23 ఓట్లు నమోదైన ఘటనను మరోసారి గుర్తు చేశారు.

అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌పైనా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆర్‌ఎస్‌ఎస్ ఒక్కొక్కటిగా దేశంలోని అన్ని వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుంటోందని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నిటిపైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు.

ADVERTISEMENT