NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీజేపీ,ఆర్ఎస్ఎస్‭లకు అధికారం మాత్రమే కావాలి.. దాని కోసం మణిపూర్‭ను తగలబెడతారు : రాహుల్ 
    తదుపరి వార్తా కథనం
    బీజేపీ,ఆర్ఎస్ఎస్‭లకు అధికారం మాత్రమే కావాలి.. దాని కోసం మణిపూర్‭ను తగలబెడతారు : రాహుల్ 
    బీజేపీ,ఆర్ఎస్ఎస్‭లకు అధికారం మాత్రమే కావాలని రాహుల్ కౌంటర్

    బీజేపీ,ఆర్ఎస్ఎస్‭లకు అధికారం మాత్రమే కావాలి.. దాని కోసం మణిపూర్‭ను తగలబెడతారు : రాహుల్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 27, 2023
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అధికారంపై మాత్రమే ఆసక్తి ఉంటుందని విమర్శించారు. దాని కోసం మణిపూర్‭ను తగులబెడతారని మండిపడ్డారు.

    అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు,ఉత్తర్‌ప్రదేశ్‌ కావచ్చు, ఇదే క్రమంలో దేశం మొత్తాన్నీ తగలబెడతారని ఫైర్ అయ్యారు. వారు దేశ దుఃఖాన్ని, బాధను పట్టించుకోరని, అధికారం కోసం దేశం మొత్తాన్ని అమ్మేస్తారని తీవ్రంగా విమర్శించారు.

    గురువారం యువజన కాంగ్రెస్ కార్యక్రమంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ మేరకు హాట్ కామెంట్స్ చేశారు.

    DETAILS

    బీజేపీ, ఆర్ఎస్ఎస్ హృదయంలో దేశమనే భావనే లేదు : రాహుల్ గాంధీ

    అధికారంలో ఉన్నవారు ప్రజల సాధక బాధలను పట్టించుకోరని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశాన్ని ముక్కలు చేసే దిశగా పనిచేస్తున్నట్లు రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    వారికి అధికారమే కావాలని, దానికోసం ఏదైనా చేస్తారని ఘాటుగా మాట్లాడారు. కాంగ్రెస్ యువజన విభాగం వారు దేశంపై ప్రేమ గలవారని, దేశం, పౌరులు బాధపడితే మీరూ బాధపడతారన్నారు.

    కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ హృదయంలో దేశ భావనే లేదన్నారు. ఎందుకంటే వారు దేశాన్ని విభజించే పని మాత్రమే చేస్తారన్నారు.

    జాతి ఘర్షణలతో నలిగిపోతున్న మణిపూర్‌ రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాన మంత్రి ప్రకటన చేయాలని ఇప్పటికే విపక్షాలు పట్టుబట్టాయి. ఆ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని ఇండియా ప్రతిపక్షాలు భీష్మించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    భారతదేశం
    బీజేపీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రాహుల్ గాంధీ

    మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా? లోక్‌సభ
    యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా బ్రిటన్
    ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు హర్యానా
    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ కాంగ్రెస్

    భారతదేశం

    డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ  దిల్లీ
    ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి  క్రికెట్
    నేను ఇండియాకు ఆడి ఉంటే 1000వికెట్లు తీసేవాడిని; పాక్ మాజీ బౌలర్ బోల్డ్ కామెంట్స్  క్రికెట్
    భారత్‌తో కలిసి యుద్ధ విమానాల ఇంజిన్‌ల అభివృద్ధికి సిద్ధం: ఫ్రాన్స్  ఫ్రాన్స్

    బీజేపీ

    వచ్చే ఎన్నికలు బండి సంజయ్ నేతృత్వంలోనే.. మరోసారి తేల్చిచెప్పిన తరుణ్ చుగ్ బండి సంజయ్
    వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం మహారాష్ట్ర
    జులై 3న కేంద్ర కేబినెట్ సమావేశం.. ఎన్నికల వేళ కీలక నిర్ణయాలకు అవకాశం భారతదేశం
    అజిత్ పవార్ ఉదంతం: 2024 ఎన్నికల వేళ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025