NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్‌కు అలవాటు: అమిత్ షా 
    తదుపరి వార్తా కథనం
    దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్‌కు అలవాటు: అమిత్ షా 
    దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్‌కు అలవాటు

    దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్‌కు అలవాటు: అమిత్ షా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

    తాజాగా కేంద్ర హోమమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడడం రాహుల్, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.

    వివరాలు 

     రాజకీయాలను ప్రాంతీయవాదం, మతం,భాషా పరంగా చీలికలు 

    అమిత్ షా మాట్లాడుతూ,"దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం,జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ఇవ్వడం,విదేశీ గడ్డపై భారత్ వ్యతిరేక ప్రకటనలు చేయడం ద్వారా.. ఆయన ప్రతిసారి దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు.కాంగ్రెస్ రాహుల్ గాంధీ ద్వారా రాజకీయాలను ప్రాంతీయవాదం, మతం,భాషా పరంగా చీలికలు తెస్తోంది.రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ మరోసారి వ్యతిరేకతను వెల్లడించింది. బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు, దేశ భద్రతతో ఆటలాడలేరు"అని స్పష్టం చేశారు.

    అగ్రరాజ్య పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పలు ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.

    వివరాలు 

    56 అంగుళాల ఛాతీ ఇక చరిత్రే

    రిజర్వేషన్ల గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ, భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలు సరైన ప్రాధాన్యం పొందడం లేదన్నారు. అభివృద్ధిలో వారి పాత్ర కూడా తక్కువ. నిష్పక్షపాత పరిస్థితులు వచ్చిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తాం అన్నారు.

    ఇక, "మీడియా, దర్యాప్తు ఏజెన్సీలతో ప్రజలను ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ, ప్రధాని మోదీ భయాన్ని వ్యాప్తి చేశారు. కానీ, ఎన్నికల తర్వాత అది మారిపోయింది. ఇప్పుడు బీజేపీను చూసి ఎవరూ భయపడట్లేదు. నేను పార్లమెంట్‌లో ప్రధాని ముందుకు వెళ్లి '56 అంగుళాల ఛాతీ ఇక చరిత్రే' అని చెప్పగలను" అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

    విదేశీ గడ్డపై రాహుల్ చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    రాహుల్ గాంధీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అమిత్ షా

    Amit Shah: హలాల్ నిషేధంపై అమిత్ షా కీలక ప్రకటన  తెలంగాణ
    Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా లోక్‌సభ
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  కేంద్ర కేబినెట్
    Amit Shah:లోక్‌సభలో మూడు కొత్త క్రిమినల్ బిల్లులను ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా  లోక్‌సభ

    రాహుల్ గాంధీ

    Lok Sabha Elections 2024: ప్రియాంకతో కలిసి వయనాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ  భారతదేశం
    Rahul Gandhi: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, రూ.55,000 నగదు.. రాహుల్ గాంధీకి రూ.20 కోట్ల ఆస్తులు  భారతదేశం
    Amethi-Rahul Gandhi: అమేథీలో రాహుల్ గాంధీ మళ్లీ స్మృతీ ఇరానీతో తలపడతారా? బీజేపీ
    Rahul Gandhi: తమిళనాడులో రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025