NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kazipet rail Coach Factory: 2026 మార్చి నుంచి కాజీపేటలో కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
    తదుపరి వార్తా కథనం
    Kazipet rail Coach Factory: 2026 మార్చి నుంచి కాజీపేటలో కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
    మార్చి నుంచి కాజీపేటలో కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

    Kazipet rail Coach Factory: 2026 మార్చి నుంచి కాజీపేటలో కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 10, 2025
    12:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌లో 2026 మార్చి నుంచి రైలు కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.

    ప్రతి నెల 50 కోచ్‌లు ఉత్పత్తి చేసి, సంవత్సరానికి మొత్తం 600 ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

    ఈ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో కోచ్‌లు, వ్యాగన్ల తయారీ, మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.716 కోట్లు వెచ్చించిందని వివరించారు.

    ఇప్పటివరకు 65% పనులు పూర్తయ్యాయని, దాదాపు రూ.360 కోట్ల నిధులు ఖర్చయినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

    వివరాలు 

    ఇంజిన్ అవసరం లేని ఈఎంయూలు 

    'కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నఈ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ దేశవ్యాప్తంగా రైలు కోచ్‌ల తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా,వరంగల్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.ఇక్కడ ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో పాటు ఇంజిన్ ప్రత్యేకంగా అవసరం లేని ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (ఈఎంయూ)కూడా ఉత్పత్తి చేయబడతాయి.నెలకు రెండు ఈఎంయూలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం,ఒక్కో యూనిట్‌లో 12 బోగీలు ఉంటాయి.ఎంఎంటీఎస్,మెట్రో రైళ్లు కూడా ఇవే తరహా ఈఎంయూలకు చెందినవే. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, ఈఎంయూలతో పాటు గూడ్స్ రైళ్ల వ్యాగన్లు కూడా ఉత్పత్తి చేయబడతాయి. ఏడాదికి 2,400 వ్యాగన్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. 160 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ యూనిట్‌లో 60,753 చ.మీ. విస్తీర్ణంలో ప్రీఇంజినీర్డ్ భవనాలు ఏర్పాటు చేయనున్నాం' అని కేంద్ర మంత్రి వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిషన్ రెడ్డి

    తాజా

    Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశాంగశాఖ
    Swiggy Q4 results: క్విక్‌ కామర్స్‌‌పై దృష్టి.. స్విగ్గీ నష్టం డబుల్‌! స్విగ్గీ
    Vijay Devarakonda : జవాన్ల కోసం రౌడీ దుస్తులు.. సైన్యానికి మద్దతు ఇచ్చిన విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Insurance-Man Died in Terror Attack:ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యక్తికి బీమా లభిస్తుందా?..ఎంత వస్తుంది..దానికి సంభందించిన రూల్స్ ఏంటి ? భీమా

    కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ బీజేపీ
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి బీజేపీ
    KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025