NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cloud kitchens: రైళ్లలో ఆహార నాణ్యతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం: అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు 
    తదుపరి వార్తా కథనం
    Cloud kitchens: రైళ్లలో ఆహార నాణ్యతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం: అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు 
    రైళ్లలో ఆహార నాణ్యతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం: అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు

    Cloud kitchens: రైళ్లలో ఆహార నాణ్యతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం: అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 11, 2024
    02:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో ఆహారానికి సంబంధించిన ఫోటోలు కూడా తరచుగా వైరల్ అవుతున్నాయి.

    ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇకపై రైళ్లలో అందించే ఆహారం కోసం బేస్ కిచెన్లకు స్వస్తి చెబుతూ, క్లౌడ్ కిచెన్ల సేవలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.

    ఇప్పటివరకు రైల్వే స్టేషన్లలో బేస్ కిచెన్ల ద్వారా వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి ప్రయాణికులకు అందించేవారు. కానీ అపరిశుభ్రత, నాసిరకం ఆహార నాణ్యతపై అనేక ఫిర్యాదులొచ్చాయి.

    Details

    ముంబయిలో క్లౌడ్ కిచెన్ల సేవలు

    ఐఆర్‌సీటీసీ కొత్త ప్రణాళికతో క్లౌడ్ కిచెన్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

    ఈ క్లౌడ్ కిచెన్లను నిపుణుల సహకారంతో నడిపి, ప్రయాణికులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

    ప్రస్తుతం ముంబైలో క్లౌడ్ కిచెన్ల సేవలు ప్రారంభమయ్యాయి.

    పోవై, కుర్లా, పన్వెల్, థానే, చెంబూర్ ప్రాంతాల్లో ఈ సేవలు నెలరోజుల కిందటే ప్రారంభమయ్యాయి.

    మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో దాదాపు 200 క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.

    Details

    రాబోయే మూడు నెలల్లో 200 కిచెన్లు

    ముంబయిలో ప్రస్తుతం 50 కిచెన్లు పని చేస్తున్నాయని, ఇంకా 90 కిచెన్లు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

    రాబోయే మూడు నెలల్లో మొత్తం 200 కిచెన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

    క్లౌడ్ కిచెన్లలో సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆహార తయారీపై కఠిన నియంత్రణ విధించనున్నారు.

    ఈ కొత్త విధానంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించగలమని రైల్వే బోర్డు నమ్మకంగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే బోర్డు
    ముంబై

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రైల్వే బోర్డు

    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా  జయవర్మ సిన్హా
    రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా రైల్వే స్టేషన్
    IRCTC Site-App Down: IRCTC డౌన్.. యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో ఇబ్బంది  టెక్నాలజీ
    Special Trians: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్  భారతదేశం

    ముంబై

    Fire Accident: నవీ ముంబైలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం  అగ్నిప్రమాదం
    IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్​ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని రాజస్థాన్
    Rohit Sharma-Cricket: ఆ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడాలంటే రోహిత్ శర్మకు వణుకే రోహిత్ శర్మ
    IPL-Cricket-Chennai: వారి వల్లే గెలిచాం...చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025