NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గుజరాత్‌లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు
    తదుపరి వార్తా కథనం
    గుజరాత్‌లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు
    పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు

    గుజరాత్‌లో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 30, 2023
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్‌లో పెను రైలు ప్రమాదం తప్పినట్టైంది. కొందరు దుండగులు పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలను వేశారు. ఈ మేరకు రైలును, పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు.

    ఇనుప స్తంభాన్ని గమనించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలు ప్రమాదం జరగకుండా సడెన్ బ్రేక్స్ వేశారు. ఆదివారం రాత్రి వడోదరలోని వర్ణ-ఇటోలా రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.

    పట్టాలపై స్తంభాన్ని గుర్తించని ఓఖా-షాలీమార్ రైలు లోకో పైలెట్ వాటిని ఢీకొట్టుకుంటూనే వెళ్లిపోయింది. కాసేపటికే అదే దారిలో పరుగులు పెడుతున్న అహ్మదాబాద్- పూరీ రైలు లోకోపైలట్ పట్టాలపై స్తంభాన్ని పసిగట్టారు.

    అనంతరం రైలును నిలుపుదల చేసిన లోకోపైలట్, రైల్వే అధికారులకు సమాచారం అందించారు.ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    DETAILS

    ఇనుప స్తంభాన్ని గుర్తించి స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఇచ్చిన లోకోపైలెట్

    రైళ్లను పట్టాలు తప్పించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కుట్ర పన్నారని అధికారులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    అంతకుముందే స్తంభాలను గమనించకుండా, వాట్ని దాటుకుంటూ వెళ్లిన రైలుకు అదృష్టవశాత్తు ఏం కాకపోవడం విశేషం.

    అయితే అదే సమయంలో అహ్మదాబాద్​-పూరీ రైలు లోకో-పైలట్​ స్తంభాలను గమనించి హుటాహుటిన ఇటోలా రైల్వే స్టేషన్ మాస్టర్​కు సమచారాన్ని చేరవేశారు.

    అనంతరం స్టేషన్​ మాస్టర్,​ కంట్రోల్​ రూముకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన రైల్వేశాఖ, వెంటనే అధికారులను, పోలీసులను అలెర్ట్ చేసింది.

    ఇప్పటికే ఈ ఏడాది జరిగిన వరుస రైలు ప్రమాదాలపై రైల్వే ప్రయాణికులు బెంబెలిత్తిపోతున్నారు. తరచుగా రైళ్లు ప్రమాదానికి గురవడం కలవరానికి గురిచేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    గుజరాత్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    గుజరాత్

    ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై గుజరాత్ హైకోర్టు కీలక ఆదేశాలు నరేంద్ర మోదీ
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా రాహుల్ గాంధీ
    గుజరాత్‌లో టాటా పంచ్‌ వాహనానికి అగ్ని ప్రమాదం టాటా
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే? రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025