
మధురై రైల్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి, మరింత పెరిగే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో రైలు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. శనివారం మధురై రైల్వేస్టేషన్కు సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటక రైలు ప్రమాదంలో (భారత్ గౌరవ్) 9 మంది దుర్మరణం పాలయ్యారు.
రైలు బోగీలోని ప్యాంట్రీ కారు(PANTRY CAR)లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది.గాలి వేగంగా, రైలు కోచ్ల్లోకి చేరడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి.ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
15 రోజుల పర్యటన కోసం లక్నో నుంచి బయలుదేరిన రైలు మధురై సమీపంలో నిలిచిపోయింది. ప్రమాద సమయంలో 63 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.
ఇప్పటికే 20 మందికిపైగా గాయాలు కాగా నలుగురు తీవ్రంగా గాయపడ్డట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై విచారణ కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తమిళనాడులో ఘోర రైలు అగ్ని ప్రమాదం
Train catches fire in #Madurai , Tamil Nadu. 8 dead and 20 others injured. #TrainAccident #TamilNadu #India pic.twitter.com/cRvHouzMIW
— Smriti Sharma (@SmritiSharma_) August 26, 2023
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాలి బూడిదైన రైలు బోగీలు
மதுரை ரயில் நிலையத்தில் நிறுத்திவைக்கப்பட்டிருந்த ரயிலில் தீ விபத்து; ரயிலில் கேஸ் சிலிண்டர் வைத்து சமைத்தபோது தீப்பற்றியதாக தகவல்#Madurai | #Fire | #Train | #FireAccident | #TrainAccident | #TrainFireAccident pic.twitter.com/Zw8RUdXPMb
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) August 26, 2023