NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు
    ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు ఎంఎంటీఎస్‌ రైళ్లు

    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 25, 2023
    11:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ మహానగరంలోని మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో పెను రైలు ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్ మీదకు ఒకేసారి రెండు లోకల్ ట్రైన్లు ఎదురెదురుగా వచ్చాయి. గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు.

    ఈ మేరకు రైళ్లను కొద్ది దూరంలో నిలిపివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్టైంది. సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే అధికారుల బృందం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుంది.

    దాదాపు అరగంట సేపు రైళ్లను అలాగే ట్రాక్‌పై నిలిపేయడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం పరిస్థితిని సమీక్షించిన అధికారులు, సదరు రైళ్లకు రూట్ క్లియర్ చేసి వైర్వేరుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    DETAILS

    రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే లైన్‌లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు

    ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే లైన్‌లోకి ఎలా వచ్చాయని కోణంలో ఇప్పటికే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.సమన్వయ లోపం ఎక్కడ జరిగింది అనే నేపథ్యంలో ఆరా తీస్తున్నారు.

    హైదరాబాద్ నగర వాసులకు అత్యంత వేగంగా, తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేర్చే ప్రజా రవాణా వ్యవస్థల్లో రైల్వేది కీలక పాత్ర. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల నుంచి పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు చాలా మంది ఎంఎంటీసీ (MMTS) రైళ్ల మీదే ఆధారపడతారు.

    అలాంటి రైళ్లు ప్రమాదం అంచున నిలబడ్డాయంటే ఆయా ప్రయాణికుల్లో ఒక్కసారిగా గుబులు రేగింది. ప్రమాదం జరగకుండా లోక్ పైలెట్ల అప్రమత్తతతో అంతా సరక్షితంగా బయటపడగలిగారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    రైలు ప్రమాదం
    రైల్వే స్టేషన్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హైదరాబాద్

    దేశానికే హైదరాబాద్ హెల్త్ హబ్.. అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి భాగ్యనగరమే నిలయం తెలంగాణ
    హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం దిల్లీ
    ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్  సాఫ్ట్ వేర్
    పెళ్లి చేసుకోమ్మన్నందుకు యువతిని చంపి మ్యాన్‌హోల్‌లోకి తోసేసిన ప్రియుడు  హత్య

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  భారతదేశం

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025