Page Loader
Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు 
ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు 

వ్రాసిన వారు Stalin
Aug 19, 2023
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబై-బెంగళూరు మధ్య నడిచే ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్‌ఆర్‌) రైల్వే స్టేషన్‌లో ఉద్యాన్ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు, మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ముంబై నుంచి బెంగళూరు స్టేషన్ మధ్య ఈ రైలు నడుస్తుంది. దీనికి కేఎస్ఆర్ స్టేషన్ చివరి స్టాప్. ప్రయాణికులు రైలు దిగిన రెండు గంటల తర్వాత అగ్నిప్రమాదం జరిగిందని సౌత్ వెస్ట్రన్ రైల్వే వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది, నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అగ్నిప్రమాదంలో రైల్వే స్టేషన్‌ను కమ్మేసిన పొగ

తెలంగాణ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌‌లోనూ మంటలు 

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌‌లో కూడా శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు ఒక్కసారిగా రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వై సిబ్బంది రైలును నాగ పూర్ సమీపంలో నిలిపేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఒకేరోజు రెండు ఎక్స్‌ప్రెస్‌‌ రైళ్లలో ప్రమాదం జరగడంతో రైల్వేశాఖ దీన్ని సీరియస్‌గా పరిగణిస్తోంది.